భారత్లో 2 టెలికం కంపెనీలు మాత్రమే మిగిలితే అది బాధాకరమేనని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. దేశీయ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా భారీ ఆర్థిక నష్టాల్లో మునిగిపోయింది. ఇది ఎప్పుడైనా మూతపడవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సునీల్ మిట్టల్ స్పందించారు. అయితే ఆయన ఎక్కడ కూడా పేరును ప్రస్తావించలేదు. వొడాఫోన్ ఐడియా పేరును ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యానించారు. గతంలో 12 టెల్కోలు ఉండగా ఇప్పుడు తగ్గిపోతే అది విషాధకరమే అన్నారు.

సునీల్ మిట్టల్ ఆశాభావం
'గతంలో మన వద్ద 12 మంది ఆపరేటర్లు ఉన్నారు. ఇప్పుడు అది 2.5కి పడిపోయింది. ఇది కూడా మున్ముందు రెండుకు పడిపోతే బాధాకరం. దేశం చాలా పెద్దది. కాబట్టి మూడు ప్రయివేటు ఆపరేటర్లు ఉంటే మంచిది. మూడు టెలికం సంస్థలు ఉండేందుకు అర్హమైన దేశం. కాబట్టి ఇలాగే కొనసాగుతుందని తాను ఆశిస్తున్నాను' అని సునీల్ మిట్టల్ అన్నారు.

ఎయిర్ టెల్ పైపైకి..
ఎయిర్టెల్ రోజురోజుకు చాలావేగంగా వృద్ధిని నమోదు చేస్తోందని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ అన్నారు. మార్కెట్ షేర్ చాలా వేగంగా పెంచుకుంటోందని తెలిపారు. ఆఫ్రికాలోను విస్తరిస్తోందని తెలిపారు. భారతీకి చెందిన వన్ వెబ్స్ శాటిలైట్ బ్రాడ్బాండ్ ఆపరేషన్స్ మార్కెట్లో గేమ్ చేంజర్ కానుందని తెలిపారు. ఎయిర్టెల్ వృద్ధికి ఇది మరింత దోహదపడుతుందన్నారు.

పెట్టుబడుల ఆకర్షణ
కొత్త ప్రపంచ ఇన్వెస్టర్లను ఆకర్షించడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను సమీకరిస్తున్నట్లు తెలిపారు. గత 24 నెలల కాలంలో 12 బిలియన్ డాలర్లు సమీకరించామన్నారు. వొడాఫోన్ ఐడియా కూడా రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధపడింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ ప్రకటన చేసినప్పటికీ సరైన ఇన్వెస్టర్ ఇప్పటి వరకు రాలేదు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications