IT News: టెక్ రంగాలో వస్తున్న వేగవంతమైన మార్పులు ఆ రంగంలోని ఉద్యోగులను అయోమయంలోకి నెడుతున్నాయి. ప్రస్తుతం ఐటీ సేవల రంగంలో ఇంట్రెస్టింగ్ ట్రెండ్ కొనసాగుతున్నట్లు దిగ్గజ కంపెనీల డేటా చెబుతోంది.
అవును ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇకపై మరోలెక్క అన్నట్లు ఉంది టెక్కీల ఉద్యోగ కష్టాలు. కరోనా సమయంలో కంపెనీలకు వారు చెప్పిందే వేదం. చేసేది లేక కంపెనీలు సైతం అప్పట్లో కొంత తలవంచాయి. కానీ ఏఐ రంగంలోకి దిగటం, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార అనిశ్చితితో చాలా మంది ఫ్యూచర్ పై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది.

దేశంలోని టాప్ టెక్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ గతవారంలోనే తమ జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేశాయి. వీటిలో కంపెనీ వెల్లడించిన వివరాలను గమనిస్తే.. ఉద్యోగుల్లో ఆసక్తికరమైన మార్పు కనిపించింది. అదేంటంటే అట్రిషన్ రేటు తగ్గటం. ఈ అట్రిషన్ రేటు కంపెనీ నుంచి మానేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సూచిస్తుంది. ఈ త్రైమాసికంలో అది అన్ని ఐటీ కంపెనీల్లోనూ గతంలో కంటే తగ్గుతూ వచ్చింది. దీనికి టెక్ కంపెనీలు నియామకాలను తగ్గించటం ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మెుదటి త్రైమాసికంలో టీసీఎస్ అట్రిషన్ రేటు 17.8 శాతం ఉండగా.. ఇన్ఫోసిస్ లో 17.3 శాతంగా ఉంది. ఇక విప్రోలో అట్రిషన్ తక్కువగా 14 శాతం వద్ద ఉంది. అలాగే హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలో అట్రిషన్ 16.3 శాతంగా నమోదైంది. ఈ రేటు మార్చితో ముగిసిన త్రైమాసికంలో దాదాపు 20 శాతానికిపైగానే ఉన్నట్లు కంపెనీలు నివేదించాయి. కొత్త రిక్రూట్మెంట్లు లేకపోవటంతో చాలా మంది ఉద్యోగం మారే విషయంపై జాగ్రత్తగా ముందకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే చాలా కంపెనీలు కొత్త నియామకాల కంటే ఉన్న ఉద్యోగులను అప్ స్కిల్ చేయటంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ఇందుకోసం వారికి శిక్షణ ఇచ్చేందుకు భారీగా ఖర్చుచేస్తున్నాయి.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్: వారానికి 4 రోజులు ఆఫీసు నుంచే పని తప్పనిసరి! హైబ్రిడ్ మోడల్కు ముగింపు పలికిన కంపెనీ

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications