Wipro: ఒక్కసారిగా ఫోకస్ మార్చిన ఐటీ దిగ్గజం విప్రో.. టామ్ మేనేజ్మెంట్ కఠిన నిర్ణయం..
Wipro News: కష్టకాలంలో కఠిన నిర్ణయాలు తప్పవని మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాయి. మనుగడకోసం పోరాడుతున్న టెక్ కంపెనీల యాజమాన్యాలు లాభాల కోసం ప్లాన్ మారుస్తున్నాయి.
దేశంలోని టాప్ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో స్పీడు పెంచాలని నిర్ణయించింది. మిగిలిన దిగ్గజాలతో పోటీపడేందుకు సిద్ధమౌతోంది. ఈ క్రమంలో రాబోయే త్రైమాసికాల్లో పెద్ద ఒప్పందాలపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. వ్యాపార మార్జిన్లను పెంచేందుకు, మరింత స్థిరమైన రాబడులను పొందేందుకు ఇది దోహదపడనుందని తెలుస్తోంది.

గడచిన త్రైమాసికంలో పెద్ద డీల్స్ మెుత్తం విలువ 1.2 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థెరీరీ డెలాప్రోట్ వెల్లడించారు. ఇది గడచిన 8 త్రైమాసికాల్లో అత్యధికమైనదని పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో 30 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగి 10 డీల్స్ బుక్ చేసినట్లు చెప్పారు. మొత్తం కాంట్రాక్ట్ విలువ(TCV) ప్రకారం 3.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్ బుకింగ్స్ చేసినట్లు వెల్లడైంది. అలాగే 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయ బకెట్లో రెండు కొత్త ఖాతాలను జోడించినట్లు సీఈవో తెలిపారు. ఇలాంటి డీల్స్ సంఖ్య రెండింతలై 21కి చేరుకుందన్నారు.
ఈ ప్లాన్ కింద లాంగ్టైల్ను తగ్గించడానికి, పెద్ద ఆపరేటింగ్ మార్జిన్లతో డీల్లపై దృష్టి పెట్టడానికి క్లయింట్ల సంఖ్యను వ్యూహాత్మకంగా తగ్గించాలని విప్రో యోచిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ కంపెనీ క్లయింట్ల సంఖ్యను 100 తగ్గించిందని.. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ ప్రెస్తో పోస్ట్ ఎర్నింగ్ ఇంటరాక్షన్లో వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ దృష్టి 20 మిలియన్ డాలర్లు, 100 మిలియన్ డాలర్ల శ్రేణిలో ఉందన్నారు. ఇటీవలి కంపెనీ త్రైమాసిక ఫలితాల ప్రకారం జూన్ తో ముగిసిన కాలానికి మెుత్తం యాక్టివ్ క్లయింట్ బేస్ 1,444గా ఉంది. పెద్ద డీల్స్ పై దృష్టి పెట్టడం వల్ల సంస్థ తన వద్ద ఉన్న ప్రతిభను ఉత్తమంగా ఉపయోగించుకోగలదని సీఎఫ్ఓ డెలాపోర్టే తెలిపారు.


Click it and Unblock the Notifications