TCS News: ఉద్యోగులకు మెమోలు పంపిన టెక్ దిగ్గజం.. హడలిపోతున్న టెక్కీలు..
TCS News: దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీగా టీసీఎస్ కొనసాగుతోంది. ఉద్యోగులను కంపెనీ ఎంత బాగా చూసుకుంటుందో క్రమశిక్షణ విషయంలోనూ అంతే సీరియస్ గా ఉంటుంది. ఈ క్రమంలో తన ఉద్యోగులను హడలెత్తిస్తోంది.
ఐటీ దిగ్గజం తమ ఉద్యోగులకు తాజాగా నోటీసులు పంపింది. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం నుంచి నెమ్మదిగా ఉద్యోగులను ఆఫీసులకు పిలిపిస్తోంది. ఈ క్రమంలో హైబ్రిడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ తీసుకొచ్చిన వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనలను పాటించని టెక్కీలపై క్రమశిక్షణా చర్యల గురించి హెచ్చరిస్తూ మెమోలు పంపింది.

కంపెనీ యాజమాన్యం అందించిన రోస్టర్ ప్రకారం ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసులకు రిపోర్ట్ చేయాలన్నారు. కేటాయించిన కార్యాలయం నుంచి ఉద్యోగులు పనిచేయాలని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో టీసీఎస్ స్పష్టం చేసింది. దీనికి ముందే కంపెనీ తన ఉద్యోగులకు రిటర్న్ టు ఆఫీస్ కార్యాచరణ కింద లక్ష్యాలను ఉంచిన విషయం జనవరిలోనే బయటకు వచ్చింది.
సంబంధిత మేనేజర్లు తమ బృందంలోని సభ్యులందరికీ రిటర్న్ టు ఆఫీస్ లక్ష్యాలను వెంటనే కేటాయించాలని మెయిల్ ద్వారా ఆదేశాలు అందాయి. అనేక కారణాలతో ఇన్నాళ్లుగా పూర్తిగా ఇంటి నుంటే పనిచేస్తున్న అనేక మంది.. తప్పనిసరిగా ఇకపై తమ దగ్గరలోని కార్యాలయానికి తిరిగి వెళ్లేలా చూడాలని కోరింది. వారానికి మూడు రోజుల చొప్పున సగటున నెలకు దాదాపు 12 రోజుల పాటు తప్పక ఉద్యోగులు ఆఫీసులకు రావటాన్ని ఇకపై కంపెనీ తప్పనిసరి చేసింది. అయితే దీనిపై కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
గత ఆర్థిక సంవత్సరం టీసీఎస్ మెుత్తంగా 44,000 మంది ఫ్రెషర్లను విజయవంతంగా ఆన్బోర్డ్ చేసింది. దీంతో మార్చి 31, 2023 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,14,795కి చేరుకుంది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం 17 శాతం పెరిగి రూ.59,162 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications