TCS: కంపెనీ ఎదుగుదల గురించి మాత్రమే కాకుండా తమ ఉద్యోగుల గురించి సైతం ఆలోచిస్తుంది. టాటా గ్రూప్ ఈ సారి కంపెనీని గాడిలో పెట్టేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. విప్రో మాటవినని ఉద్యోగులను తొలగించిన తరువాతి రోజే కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఈ విషయం వెనుక ఉన్న మర్మమేంటో ఇప్పుడు తెలుకుందాం..

25 బిలియన్ డాలర్ల కంపెనీ..
టాటా గ్రూప్ వ్యాపారంలో టీసీఎస్ కంపెనీది చాలా కీలక భాగం. కరోనా తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి తిరిగి చేరుకోవటంతో కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లను ఆఫీసు నుంచి పనిచేయిస్తోంది. కస్టమర్లు సైతం కంపెనీ కార్యాలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ప్రయత్నాలు మెుదలు పెట్టింది.

హైబ్రిడ్ వర్క్ మోడల్..
2025 నాటికి హైబ్రిడ్ వర్క్ మోడల్ను అమలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. అయితే దీనికి ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడిన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించి కరోనా ముందు నాటి పరిస్థితులను తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇకపై ఉద్యోగులు వారంలో 3 రోజుల పాటు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాట మర్చిపోమని తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. ఇతర ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగుల నియామకం సమయంలోనే NO Work from Home అని చెప్పేస్తున్నాయి.

మేనేజర్లను సంప్రదించాలని..
రిటర్న్-టు-ఆఫీస్ ప్లాన్ కింద ఉద్యోగులు ఆఫీసుకు తిరిగి రావడానికి సంబంధించి ప్రాజెక్ట్ల కోసం చేసిన ఏర్పాట్లను తెలుసుకోవటం కోసం వెంటనే తమ మేనేజర్లను సంప్రదించాలని TCS వెల్లడించింది. ప్రాజెక్ట్ అవసరాల ఆధారంగా రోస్టరింగ్ చేయబడుతుందని తెలిపింది. ఫ్రెషర్లు, అనుభవజ్ఞులైన నిపుణుల కలయిక ఉంటుందని TCS ప్రతినిధి తెలిపారు.

25/25 మోడల్ అమలు..
కంపెనీ 25/25 మోడల్ ప్రకారం .. 25 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఒకేసారి ఆఫీసుల నుంచి పని చేయవలసిన అవసరం లేదు. వారు తమ సమయాన్ని 25 శాతానికి మించి ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఏ ప్రాజెక్ట్లోనైనా 25 శాతం కంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండరాదని TCS తెలిపింది. అయితే దీనిని అమలు చేయటానికి ముందు ఆఫీసులు వచ్చే ఉద్యోగుల సంఖ్యను 80 శాతానికి పెంచాలన్నది కంపెనీ లక్ష్యం.

6 లక్షల ఉద్యోగులు..
TCSకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600,000 మంది ఉద్యోగులు ఉన్నారు. FY23 మొదటి త్రైమాసికంలో ఉద్యోగుల అట్రిషన్ రేటు 19.7 శాతంగా ఉంది. ఇది ఆరు త్రైమాసికాల్లో అత్యధికం. మొదటి త్రైమాసికంలో 14,000 మందిని నియమించుకుంది. అంతకు ముందు సంవత్సరం ఈ సంఖ్య 24,000గా ఉంది.
More From GoodReturns

Success story: రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాడు!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications