Infosys News: దేశంలో అన్ని కంపెనీలు నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆదాయాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు చెల్లించే వేరియబుల్ వేతనాల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
వ్యాపార వాతావరణం అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దిగజారుతున్న తరుణంలో భారతీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసిన నాలుగో త్రైమాసికానికి తన ఉద్యోగులకు సగటున 60 శాతం వేరియబుల్ వేతనాన్ని అందజేయనున్నట్లు వెల్లడైంది. దీంతో చాలా ఆశలు పెట్టుకున్న టెక్కీలకు అనుకోని షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. మరో పక్క ఉద్యోగ అవకాశాలు సైతం నామమాత్రంగానే ఉన్నాయని వారు చెబుతున్నారు.

కంపెనీ ఉద్యోగులకు పంపించిన మెయిల్ ప్రకారం .. ప్రతి ఉద్యోగికి ఖచ్చితమైన చెల్లింపు వారి సంబంధిత శాఖ మార్గదర్శకాలకు లోబడి ఉంటుంటాయని వెల్లడించింది. అలాగే ఉద్యోగి పే గ్రేడ్, విభాగాల ఆధారంగా చెల్లింపుల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని తెలిపింది. కంపెనీ FY23లో కంపెనీ మొత్తం బలమైన పనితీరును కనబరిచిందని అంతర్గత ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు వెల్లడించింది. ఇదే సమయంలో మార్కెట్ అస్థిరతలు, ఊహించని సంఘటనలను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా అమెరికా, యూరోపియన్ మార్కెట్లలో ఏడాది ప్రారంభంలో జరిగిన బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో ఐటీ పరిశ్రమపై పెరుగుతున్న ఒత్తిడిని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.6,128 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది డిసెంబరు త్రైమాసికం కంటే దాదాపు 16 శాతం వరకు తక్కువని తెలుస్తోంది.

గతంలో సైతం కంపెనీ ఉద్యోగులకు వేరియబుల్ పే విషయంలో తగ్గింపులను ప్రకటించిన విషయం తెలిసిందే. క్యూ-4 ఫలితాలపై మాట్లాడిన సీఈవో సలీల్ పరేఖ్ తాము మధ్యస్థ కాలంలో అధిక మార్జిన్లకు మార్గాన్ని నిర్మించడానికి సామర్థ్యం, వ్యయంపై అంతర్గత కార్యక్రమాన్ని విస్తరించామని తెలిపారు. అలాగే హ్యూమన్ రిసోర్సెస్, ఖాతాదారులకు మద్దతుగా పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తున్నారు. మార్చి త్రైమాసికంలో ఐటీ సంస్థలో అట్రిషన్ రేటు 20.9 శాతంగా నమోదైంది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్: వారానికి 4 రోజులు ఆఫీసు నుంచే పని తప్పనిసరి! హైబ్రిడ్ మోడల్కు ముగింపు పలికిన కంపెనీ

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications