IT News: టెక్కీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన టెక్ కంపెనీ.. తగ్గనున్న ఉద్యోగుల జీతం..!!
IT News: దేశంలోని ఐటీ కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు షాకులివ్వటం మెుదలెట్టాయి. ఉద్యోగులను పీకేసేంత కఠినంగా వ్యవహరించనప్పటికీ మారుతున్న వ్యాపార వాతావరణానికి అనుగుణంగా తమ కంపెనీ పాలసీలను మార్చుతున్నాయి.
టాప్-5 టెక్ కంపెనీలు సైతం మారుతున్న వ్యాపార పరిస్థితులతో అనేక చిక్కులు ఎదుర్కొంటున్నాయి. అయితే తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్సీఎల్టెక్ తన ఉద్యోగులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కంపెనీ తన హెచ్ఆర్ పాలసీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల టెక్కీలు పొందే జీతాలు, పరిహారాల విషయంలో అనేక మార్పులు జరిగాయి.

హెచ్సీఎల్ చేపట్టిన తాజా మార్పుల వల్ల టెక్కీల జీతం ఇకపై తగ్గనుంది. అవును నోయిడా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న టెక్ దిగ్గజం ఉద్యోగుల ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్కి సంబంధించిన తన విధానాన్ని మార్చుకుంది. ఇది ఉద్యోగులకు అందించే వేరియబుల్ పేలో ఒక భాగం. గతంలో ఇది నెలవారీ ప్రాతిపదికన కంపెనీ చెల్లించేది. కానీ ఇప్పుడు దీనిని మూడు నెలలకు ఒకసారి చెల్లించనున్నారు. అలాగే బెంచ్లో ఉన్న ప్రస్తుత ఉద్యోగులు EPB పొందడానికి అర్హులు కారని కంపెనీ తేల్చి చెప్పింది. ఈ కారణంగా ఉద్యోగులు పొందే జీతం తగ్గుతుంది.
ఏప్రిల్ 1, 2023 నుంచి ఉద్యోగి పనితీరుపై త్రైమాసిక మేనేజర్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉద్యోగులకు EPB చెల్లించబడుతుందని కంపెనీ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ లో స్పష్టం చేసినట్లు వెల్లడైంది. ఏదైనా క్వార్టర్లో ఉద్యోగి మధ్యలోనే మానేస్తే.. వారు కొత్త పాలసీ ప్రకారం ఈపీబీ పొందేందుకు అర్హులు కాదని కంపెనీ ఉద్యోగులకు తెలిపింది. ఈపీబీ సాధారణంగా మొత్తం పరిహారంలో 3 నుంచి 4 శాతం ఉంటుందని. అలాగే సగటు చెల్లింపు దాదాపు 80 శాతం ఉంటుందని కంపెనీ చెబుతోంది. అయితే హెచ్సీఎల్ టెక్పై కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తానని ఎంప్లాయీ యూనియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీ సెనేట్ ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు.


Click it and Unblock the Notifications