భారతదేశంలో అమల్లోకి రానున్న కొత్త కార్మిక నిబంధనలు దేశ ఐటీ రంగంలో శ్రమ విధానం, వేతన నిర్మాణం, ఉద్యోగి సంక్షేమ వ్యవస్థలను గణనీయంగా ప్రభావితం చేయనున్నాయని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవి ఐటీ ఉపాధి యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని దెబ్బతీయవు, అయితే సంస్థలు పెరగబోయే వేతన ఖర్చులను భరించేందుకు, ప్రమాణాలకు అనుగుణంగా లోతైన మార్పులకు సిద్ధం కావాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపుతున్నాయని వారు పేర్కొన్నారు.
భారత ఐటీ రంగం ఇప్పటికే డాక్యుమెంటేషన్, కాంట్రాక్టులు, ఉద్యోగి రికార్డులు, పనివిధానాలు, వేతన నిర్మాణాలలో సమగ్ర ప్రక్రియలను అనుసరిస్తున్నప్పటికీ, రాబోయే త్రైమాసికాలలో పరిహార నిర్మాణంలో మౌలిక మార్పులు అనివార్యం కానున్నాయి. కంపెనీలు విక్రేత పాలనను మరింత కట్టుదిట్టం చేయడం, ఉద్యోగి సంక్షేమానికి సంబంధించిన సాంకేతిక, ఆపరేషనల్ అప్డేట్లలో పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగ ఒప్పందాలను పునర్వ్యవస్థీకరించడం వంటి అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది.

ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది ప్రామాణిక వేతన నిర్వచనం. కొత్త చట్టాల ప్రకారం ప్రాథమిక వేతనాన్ని పూర్తివేతనం కనీసం 50 శాతంగా నిర్దేశించాల్సి ఉంటుంది. దీనితో కంపెనీలు ఇప్పటివరకు తక్కువగా ఉంచిన బేసిక్ శాతాన్ని పెంచాల్సి రావడం వలన PF, gratuity, ESI వంటి statutory benefits ఖర్చులు కూడా అధికమవుతాయి. TeamLease CEO నీతి శర్మ ఈ అంశంపై మాట్లాడుతూ.. ఇది ముఖ్యంగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులకు అత్యధిక ప్రభావం చూపుతుందని తెలిపారు. అలాగే HR బృందాలు పాత కాంట్రాక్టులను తిరిగి రాయడం, ఉద్యోగ నియామక లేఖలను ప్రామాణీకరించడం, ఉద్యోగి రికార్డులను డిజిటలైజ్ చేయడం వంటి పనులను వేగవంతం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా Section 13 with Rule 6 ప్రకారం.. వారానికి 48 గంటల సాధారణ పని గంటలతో చట్టం సవరణలు అమలు చేయబడతాయి. ఒక ఉద్యోగి ఆరు రోజుల కంటే తక్కువ పని చేస్తే, రోజుకు గరిష్టంగా 12 గంటలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది, ఇక మిగతా రోజులు వేతనంతో కూడిన సెలవుగా పరిగణించాలి. ఇది ఉద్యోగి జీవన-పని సమతుల్యతను మెరుగుపరచడానికి సహకరిస్తుందనే భావన ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్ డెలివరీలు, షెడ్యూల్ ఒత్తిడి వంటి అంశాలలో కంపెనీలు కొత్త ప్రణాళికలను అమలు చేయాలి.
Xpheno సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ మాట్లాడుతూ.. 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు తప్పనిసరి వార్షిక ఆరోగ్య పరీక్షలు, PF, ESI కవరేజీల విస్తరణ వలన కంపెనీలు workforce planning, ఖర్చు నమూనాలను పూర్తిగా పునర్నిర్మించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీని వలన ఉద్యోగుల సంక్షేమం మెరుగయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కంపెనీల ఆర్థిక ఒత్తిడి తాత్కాలికంగా పెరగవచ్చని తెలిపారు.ఈ మార్పులతో, భారత కార్మిక వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు సరిపోలే విధంగా ఆధునీకరించడమే ప్రధాన ఉద్దేశమని పరిశ్రమ నాయకులు భావిస్తున్నారు. దీర్ఘకాలికంగా చూడగలగినప్పుడు, ఇది ఉద్యోగి భద్రతను పెంపొందించడం మాత్రమే కాకుండా, శ్రామిక శక్తి స్థిరత్వం, పారదర్శకతకు దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications