TCS News: రూ.15,000 కోట్ల ఆర్డర్ కొట్టేసిన ఐటీ దిగ్గజం టీసీఎస్.. డీల్ వివరాలు..
TCS News: ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నేతృత్వంలోని కన్సార్టియం భారీ ఆర్డర్ చేజిక్కించుకుంది. మే 22, 2023న దాదాపు రూ.15,000 కోట్ల విలువైన అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్ను అందుకున్నట్లు ప్రకటించింది.
అమెరికా, యూకే మార్కెట్లు మందగించిన సమయంలో దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారు అతిపెద్ద డీల్ కుదుర్చుకున్నారు. దేశవ్యాప్తంగా 4జీ నెట్వర్క్ విస్తరణ అమలు ప్రణాళికలో ఉన్నట్లు స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్ లో వెల్లడించింది. కన్సార్టియంలో టాటా గ్రూప్ టెలికాం గేర్ మేకింగ్ కంపెనీ తేజస్ నెట్వర్క్స్ ఉంది. ఇది రేడియో యాక్సెస్ నెట్వర్క్స్ పరికరాలను సరఫరా చేయడానికి, సర్వీసింగ్ చేయడానికి బాధ్యత వహిస్తుంది.
TCSతో పాటు ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర-రక్షణ ITI లిమిటెడ్కి కూడా APO జారీ చేయబడింది. ఈ ఒప్పందం TCSకి ఆదాయాన్ని పెంచుతున్నప్పటికీ.. ఇతరులతో జతకట్టడం కారణంగా మార్జిన్ తగ్గుతుందని తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా జరిగిన మూడో అతిపెద్ద ఒప్పందం ఇదని తెలుస్తోంది. దీనికి ముందు అమెరికా, బ్రిటన్ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి.
జూలై 2022లో కేంద్ర మంత్రి వర్గం బీఎస్ఎన్ఎల్ పునరుద్ధణకు రూ.1.64 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో రూ.43,964 కోట్ల నగదు మద్దతు, రూ.1.20 లక్షల కోట్ల నగదు రహిత సహకారం ఉన్నాయి. పునరుద్ధరణ ప్యాకేజీలో BSNL సేవల నాణ్యతను మెరుగుపరచడం, బ్యాలెన్స్ షీట్ను తగ్గించడం, భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (BBNL)తో విలీనం ద్వారా ఫైబర్ రీచ్ను విస్తరించడం అనే మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి.