IT News: ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల రంగంలో విస్తరించిన భారత టెక్ కంపెనీల పరిస్థితి అస్సలు బాగోలేదు. మెుదటి త్రైమాసిక ఫలితాలు వెలువడిన తర్వాత కంపెనీలు కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
దేశంలోని టాప్-5 ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టెక్ మహీంద్రా తాజాగా క్యూ1 ఫలితాలు ప్రకటించింది. ఫలితాలు దిగజారటంతో కంపెనీలోని ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో మాదిరిగానే టెక్ మహీంద్రా ఉద్యోగులకు జీతాల పెంపులను వాయిదా వేసింది. కంపెనీ ప్రకటన ప్రకారం కంపెనీలో పనిచేస్తున్న కొన్ని సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు జీతాల పెంపు వాయిదా పడినట్లు తేలింది. టెక్ మహీంద్రా గత సంవత్సరం జూన్ త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 39 శాతం తక్కువ లాభాలను నమోదు చేసింది.

ఐటీ కంపెనీల్లో వ్యాపార మందగమనం ఉద్యోగులతో పాటు సీఈవోలను సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాధారణంగా ఏ కంపెనీలోని సీఈవోలు ఎక్కువ పారితోషికం పుచ్చుకుంటున్నారనే అంశం తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. టెక్కీలు వీటిని గమనిస్తుంటారు. విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే, ఇన్ఫోసిల్ సీఈవో సలీల్ పారిఖ్ల మధ్య గత కొన్నేళ్లుగా తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి కూడా ఇదే కొనసాగుతుందని భావించినప్పటికీ కథ మెుత్తం మారిపోయింది.
ఇదే క్రమంలో హెచ్సీఎల్ టెక్ సీఈవో సి.విజయకుమార్ జీతం 80 శాతం తగ్గింది. విజయకుమార్ 2023 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.28.4 కోట్ల వేతనం పొందారు. దీనికి మునుపు ఏడాది ఆయన గరిష్ఠంగా రూ.130 కోట్లు జీతంగా అందుకున్నారు. దీంతో దేశంలోని ఐటీ సేవల కంపెనీల్లో అత్యధిక జీతం పొందిన సీఈవోగా రికార్డు నెలకొల్పారు. కానీ ప్రస్తుతం అతి తక్కువ వేతనం అందుకుంటున్న ఐటీ కంపెనీ సీఈవోగా నిలిచారు.
విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే రూ.82 కోట్ల జీతంతో 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వేతనం అందుకున్న ఐటీ సీఈవోల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో 56.4 కోట్ల రూపాయలతో ఇన్ఫోసిస్ సలీల్ పారిఖ్, 30.1 కోట్ల రూపాయలతో టెక్ మహీంద్రా సీఈవో సిబి కుర్నాని 3వ స్థానం, 29.16 కోట్ల రూపాయలతో టీసీఎస్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథ్ 4వ స్థానం, 28.4 కోట్లతో హెచ్సిఎల్ టెక్ సీఈవో సి.విజయకుమార్ 5వ స్థానంలో నిలిచారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications