Investment: మాంద్యం భయాలు ముదురుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. వరుస నష్టాలతో ఉత్తమ కంపెనీలు సైతం నష్టపోతున్నాయి. ప్రస్తుతం ఈ అవకాశాన్ని చాలా మంది ఇన్వెస్టర్లు తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ఠాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ క్రమంలో వేటిలో ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పడిపోతున్న షేర్ ధరలు..
గత ఏడాది కాలంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో కంపెనీలు గత ఏడాది కాలంలో ఏకంగా 45 శాతం వరకు పడిపోయాయి. కంపెనీల ఆదాయ మార్జిన్లు పడిపోవటం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు దీని వెనుక ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇన్ఫోసిస్ 21.52 శాతం క్షీణించగా, విప్రో స్టాక్ 44.81 శాతం, TCS షేర్లు 22.51 శాతం తగ్గాయి.

గోల్డ్మన్ సాచ్స్ ఇలా..
ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ అండ్ రేటింగ్ సంస్థ గోల్డ్మన్ సాచ్స్ దిగ్గజ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లకు SELL రేటింగ్ అందించింది. అయితే విప్రోకు మాత్రం BUY రేటింగ్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అలుముకున్న సంభావ్య మందగమనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రేటింగ్ ఇచ్చినట్లు వెల్లడించింది. గోల్డ్మన్ సాచ్స్ ఈ ఏడాది సెప్టెంబర్ మధ్యలో టాప్ 5 భారతీయ కంపెనీలకు FY24E డాలర్ ఆదాయ వృద్ధి అంచనాను కూడా తగ్గించింది.

రీసెర్చ్ కంపెనీ అడ్వైజ్..
ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు ప్రస్తుత ధరల వద్ద కొనుగోలు చేసి హోల్డ్ చేయవచ్చని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో TCSకి ముఖ్యమైన మద్దతు స్థాయిగా రూ.2,900ని సూచించారు. ఇన్ఫోసిస్ టార్గెట్ ధర రూ.1,670, టీసీఎస్ టార్గెట్ ధర రూ.3,600 అని ఆషికా గ్రూప్ లీడ్ ఐటీ అనలిస్ట్ చిరాగ్ కచ్చడియా తెలిపారు. కష్టకాలంలో ఇన్ఫోసిస్, TCSలలో పెట్టుబడులు పెట్టటం కంపేరిటివ్ గా సురక్షితమైనదని వారు అంటున్నారు.

దీర్ఘకాలంలో ఇన్ఫోసిస్..
దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెడుతున్నట్లయితే Infosys స్టాక్ మంచి వాల్యూ పిక్ అని షేర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ రీసెర్చ్ హెడ్ రవి సింగ్ తెలిపారు. విప్రో సమీప కాలంలో రూ. 380 - 400 స్థాయిల రేంజ్ బౌండ్ జోన్లో ట్రేడ్ కావచ్చని చెప్పారు.

Tips2trades..
పతనం సమయంలో ఇన్ఫోసిస్, విప్రో, TCS సహా భారతీయ IT స్టాక్స్ కనిష్ఠాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో Infosys & Wipro రెండూ సాంకేతికంగా ఎక్కువగా అమ్ముడవుతున్నాయని Tips2tradesకు చెందిన అభిజీత్ వెల్లడించారు. అయితే టీసీఎస్ కంపెనీ షేర్లు రానున్న రోజుల్లో 3,110-3,190 టార్కెట్ రీచ్ అవుతాయని అంచనా వేశారు. అయితే మెుత్తానికి మూడు కంపెనీలు ఐటీ రంగంలో దిగ్గజాలుగా కొనసాగుతున్నందున ఇన్వెస్టర్లు తమ రిస్క్ రిటర్న్ అంచనాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టటం ఉత్తమం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications