IT Employees: ఒకపక్క ఐటీ కంపెనీలకు భారీగా ప్రాజెక్టులు వస్తుంటే.. ఉద్యోగులు కొరకరాని కొయ్యలుగా మారటం కంపెనీలకు ఇబ్బందులు కలిగిస్తోంది. భారతీయ ఐటీ కంపెనీల చేతిలో వచ్చే 5 ఏళ్లకు సరిపడా వ్యాపారం ఉంది. అయితే మాంద్యం భయాలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. ఉద్యోగుల తీరు అనేక కంపెనీలకు మాత్రం ఇబ్బందిగా మారింది.

సర్వేలో షాకింగ్ విషయాలు..
ఈ క్రమంలో కంపెనీలు ఐటీ ఉద్యోగులపై ఇంటి నుంచి పని, ఆఫీసు హాజరుకు సంబంధించి సర్వే నిర్వహిస్తున్నాయి. ఈ సర్వేలో ఐటీ ఉద్యోగుల స్పందన ప్రముఖ ఐటీ కంపెనీలను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఐటీ రంగంలోని ఉద్యోగుల మధ్య సర్వే నిర్వహించింది. అయితే ఇందులో దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు వచ్చే 6 నెలల్లో కార్యాలయానికి రావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.

వారానికి 5 రోజులు..
ఒక్క శాతం కంటే తక్కువ మంది వారానికి 5 రోజుల పాటు ఆఫీసులకు రావాలని, కరోనా ముందులాగా పని చేయాలనుకుంటున్నట్లు తమ ప్రాధాన్యతను వ్యక్తం చేశారు. ఇది చిన్న, మధ్య తరహా ఐటీ సిబ్బందికి పెద్ద షాక్గా మారింది. హైబ్రిడ్ మోడల్ను అనుసరించడానికి చాలా కంపెనీలు సిద్ధమౌతున్నాయి.

రాజీనామాల భయం..
కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 42 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కట్ చేసి ఆఫీసుకు పిలిస్తే రాజీనామా చేస్తామని తెలిపారు. అలాంటి సందర్భం ఎదురైతే వేరే కంపెనీలకు మారేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

పార్ట్ టైమ్ ప్రీలాన్సింగ్ చేస్తూ..
IT, టెక్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్న సమయంలో పార్ట్టైమ్ లేదా ఇతర కంపెనీలకు ఫ్రీలాన్సర్లుగా పని చేస్తున్నారు. దీని ద్వారా వారు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఆఫీసులకు తిరిగి వెళితే ఈ అవకాశం పోతుందని, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవటం కుదరదని వారు అంటున్నారు. ఈ అదనపు ప్రీలాన్సర్ ఉద్యోగాల గురించి ఐటీ కంపెనీలు కూడా తెలుసుకుంటున్నాయి.

హైబ్రిడ్ మోడల్ అనుసరిస్తే..
సర్వేలో పాల్గొన్న వారిలో ఒక్కశాతం కంటే తక్కువ మంది మాత్రమే వారానికి 5 రోజులు కార్యాలయానికి రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. 50 శాతం మంది మాత్రమే వారానికి 3 రోజుల పాటు ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మిగిలిన 49 శాతం మంది మాత్రం ఆఫీసులకు రాలేమని తేల్చి చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీలు చిన్న నగరాల్లో ఉద్యోగులకు దగ్గరగా తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications