బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. ఓ సరికొత్త ప్రాజెక్ట్ను చేపట్టింది. ఇప్పటిదాకా రాకెట్లు, శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించడానికే పరిమితమౌతూ వచ్చిన ఆ సంస్థ కమర్షియల్ బాట పట్టినట్టు కనిపిస్తోంది. ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ను చేపట్టింది. మ్యాప మై ఇండియాతో కలిసి ఓ జాయింట్ వెంచర్ను ప్రారంభించింది. మ్యాపింగ్ పోర్టల్, జియోస్పేసియల్ సర్వీసుల కోసం ఓ సమగ్ర నేవిగేషనల్ మ్యాప్ను అందుబాటులోకి తీసుకుని రానుంది.
మ్యాప్ మై ఇండియాకు చెందిన డిజిటల్ మ్యాప్స్, ఇస్రో శాటిలైట్ ఇమేజినరీ ఎర్త్ అబ్జర్వేషన్ డేటా సహకారంతో దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు మ్యాప్ మై ఇండియా ముఖ్యకార్యనిర్వహణాధికారి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహన్ వర్మ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తాము దీన్ని చేపట్టబోతోన్నామని పేర్కొన్నారు. మ్యాపులు, నేవిగేషన్ వంటి ఇతర జియోస్పేసియల్ సర్వీసుల కోసం విదేశీ కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం ఇకపై రాబోదని చెప్పారు. అలాంటి సేవలకు మేడిన్ ఇండియా దోహదపడుతుందని చెప్పారు.

ఈ సమాచారాన్ని ఇస్రో ధృవీకరించింది. మ్యాప్ మై ఇండియాతో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. మ్యాప్ మై ఇండియా సొంత సంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఈ ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. ఇదివరకే ఇస్రో సొంతంగా నేవిగేషన్ సిస్టమ్ నేవిక్ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. నేవిక్ పేరుతో వెబ్ సర్వీసులు, అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్ఫేస్ వ్యవస్థను చేపట్టింది.
తాజాగా మ్యాప్ మై ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం.. భువన్, వేదాస్, మోస్డాక్ పేర్లతో జియో పోర్టల్ సర్వీసులను అందుబాటులోకి తీసకుని రానుంది. స్వదేశీ మ్యాపింగ్ పోర్టల్ రూపకల్పన, భౌగోళిక సమాచార సేకరణ, ఇతర సేవల కోసం సొంతంగా మ్యాప్/ఎర్త్ అందుబాటులోకి వస్తాయని రోహన్ వర్మ తెలిపారు. భవిష్యత్తులో నేవిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్/గూగుల్ ఎర్త్పై ఆధారపడాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో 9-5 షెడ్యూల్ అంటే ఇదే.. సోషల్ మీడియాలో టెక్కీ షేర్ చేసిన రియాలిటీ!

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bengaluru: బెంగళూరు స్టార్టప్ సంచలనం.. 'బజార్నౌ'లోకి భారీగా వస్తున్న పెట్టుబడులు!

బెంగళూరు ఆటో డ్రైవర్ల ఫోన్ వ్యసనంపై హాట్ డిబేట్.. సాప్ట్వేర్ ఇంజనీర్ ఆందోళనపై ఎవరేమన్నారంటే..

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

ఫ్రిజ్లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications