Space programs: అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తోన్న విజయాలను చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. రాకెట్ సహా వాటి విడిభాగాలను సైకిల్, ఎడ్లబండిపై తీసుకెళ్లినప్పుడు కొన్ని దేశాలు మనల్ని చూసి నవ్వాయి. ఇప్పుడు అవే దేశాలు తక్కువ ఖర్చుతో తమ ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెట్టమని ఇండియా వెంటపడుతున్నాయి. ఈ అవకాశాన్ని వ్యాపార కోణంలో చూడాలని ఇస్రో భావిస్తోంది.
భారత అంతరిక్ష రంగం 'క్లోజ్డ్' మరియు 'సీక్రెటివ్' సొసైటీ నుంచి ఓపెన్గా మారుతోందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. దీనిని కేవలం ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయకుండా ఆర్థిక, వ్యాపార అవకాశంగా మలచాలని భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికా వంటి దేశాల మాదిరిగా.. ఈ రంగం ద్వారా రెవెన్యూ జనరేట్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ 2024లో వెల్లడించారు.

గత 60 ఏళ్లలో అంతరిక్ష రంగం ద్వారా రాకెట్ల తయారీ నుంచి ఉపగ్రహాల వరకు సామాన్యులకు ఉపయోగపడే సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ వివరించారు. ఫలితంగా స్పేస్ ప్రోగ్రామ్స్ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటున్నట్లు తెలిపారు. దానిని 10 రెట్లు పెంచాలనే లక్ష్యంతో దేశ అంతరిక్ష విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
రాకెట్లు మరియు ఉపగ్రహాల తయారీని ప్రైవేట్ రంగానికి అప్పగించడం సహా చంద్రయాన్, ఆదిత్య ఎల్ 1 మరియు గగన్యాన్ వంటి ఇస్రో పరిశోధన కార్యకలాపాలను పెంచడంపై దృష్టి పెట్టామన్నారు. ఇందులో భాగంగా బోయింగ్ వంటి పలు కంపెనీలతో చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. తద్వారా పలువురు కొత్త ప్లేయర్స్, స్టార్టప్స్, పరిశ్రమలు ఈ రంగంలోకి వచ్చేందుకు మార్గం సిద్ధం చేస్తున్నామన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications