IT News: ఇటీవల మార్కెట్ అనిశ్చితులు, గ్లోబల్ వ్యాపార పరిస్థితుల కారణంగా ఐటీ రంగంలోని కంపెనీల షేర్లు భారీ పతనాలను నమోదు చేశాయి. దీనికి తోడు ఆదాయాలు తగ్గుదాయనే అంచనాలు వాటి విలువను తగ్గించాయి.
ఇలాంటి సందర్భంలో భారతీయ ఐటీ స్టాక్లలో ఇటీవలి పతనం అధిక విలువను సూచిస్తుందా లేదా కొనుగోలు చేయడానికి మంచి అవకాశాన్ని అందిస్తుందా అనే అనుమానాలు చాలా మంది ఇన్వెస్టర్లలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రంగం షేర్లలో డిప్ ఉన్నప్పటికీ.. నిఫ్టీ ఐటీ సూచీని గమనించినట్లయితే ఇప్పటికీ దాని 10 ఏళ్ల సగటు విలువలతో పోలిస్తే 10% ప్రీమియంతో ట్రేడవుతోంది.

టాప్ టెక్ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా వంటి కంపెనీల షేర్లు కరోనా ముందు కంటే అధిక ధరకు ట్రేడవుతున్నాయి. ఇదే సమయంలో మిడ్క్యాప్ ఐటీ స్టాక్లు లార్జ్ క్యాప్స్తో పోలిస్తే 25% ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్ స్టాక్ దాని 52 వారాల గరిష్ఠ ధర అయిన రూ.1,672 స్థాయి నుంచి 24 శాతానికి పైగా క్షీణించింది. ఇదే క్రమంలో టీసీఎస్ స్టాక్ గరిష్ఠాల నుంచి 11 శాతం, విప్రో షేర్ 14 శాతం మేర క్షీణించాయి.
స్టాక్ ధరల్లో కరెక్షన్ ఉన్నప్పటికీ.. లార్జ్-క్యాప్ IT స్టాక్ల ఫార్వర్డ్ PE రేషియోలను గమనిస్తే కొనుగోళ్లకు బెస్డ్ వ్యాల్యూ కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇటీవల యాక్సెంచర్ ఆదాయాలపై చేసిన కీలక కామెంట్స్ తర్వాత.. భవిష్యత్తు త్రైమాసికాల్లో ఆదాయాలు తగ్గుతాయని వెల్లడైంది. అందువల్ల షేర్ ధర రానున్న కాలంలో మరింత కరెక్షన్లకు గురయ్యే అవకాశం ఉందని బ్రోకరేజ్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. యూఎస్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని తిరిగి పొందగలిగితే.. భారత ఐటీ సేవల కంపెనీల మంచి వ్యాపార అవకాశాలను పొందగలవు. ఇది పరోక్షంగా వాటి ఆదాయాల పెరుగుదలకు దోహదపడుతుంది. అప్పుడే షేర్లు ఆకర్షనీయంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications