ఆన్లైన్లో పాలసీల అనుమతి, మార్చి వరకు పొడిగింపు
కరోనా నేపథ్యంలో సాధారణ కార్యకలాపాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో బీమా కంపెనీలు.. పాలసీదారుల అనుమతులు ఆన్లైన్లో తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఇచ్చిన గడువును Irdai వెసులుబాటు కల్పించింది. దీనిని మరో మూడు నెలలు పొడిగించింది Irdai. మార్చి 31, 2021 వరకు ఆన్లైన్ మార్గంలో అనుమతులు తీసుకోవడానికి గడువును పొడిగిస్తున్నట్లు బీమా అభివృద్ధి, నియంత్రణ ప్రాధికార సంస్థ తెలిపింది.
కరోనా కారణంగా ఆగస్ట్ నెలలో ప్రయోగాత్మకంగా ఆన్లైన్ పాలసీలకు ఇన్సురెన్స్ రెగ్యులేటర్ అనుమతించింది. దీంతో పాలసీదారులు, బీమా సంస్థలకు ఊరట లభించింది. ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించడం ఊరట కలిగించే విషయం. జీవిత బీమా పాలసీదారుల నుండి వస్తున్న స్పందన, బీమా సంస్థలు అందుకు సన్నద్ధమైన తీరును పరిగణలోకి తీసుకున్న Irdai తాజగా అన్ని బీమా ఉత్పత్తులకు గడువును పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది.
ఆన్లైన్లో అమలు జరుగుతున్న తీరుపై బీమా కంపెనీల నుండి అందిన సమాచారం ఆధారంగా గడువును పొడిగించాలని Irdai నిర్ణయించింది. పాలసీ తీసుకునేవారు డిజిటల్ సంతకంద్వారా లేదా లింక్పై ధ్రువీకరించడం లేదా ఓటీపీ నిర్ధారణ.. వీటిలో ఏదో ఒక దాని ద్వారా పాలసీని ప్రారంభించవచ్చు.
బ్యాంకు ఉద్యోగులకు గుడ్న్యూస్, 15% వేతన పెంపు: వారానికి 5 డేస్ వర్కింగ్పై నిరాశ