ముంబై: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) గుడ్న్యూస్ ఇచ్చింది. లక్షలాదిమందికి ప్రయోజనం కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా రెండు సంవత్సరాల కిందట రద్దయిన సౌకర్యాన్ని పునరుద్ధరించింది. ఇవ్వాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఆర్సీటీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ఐఆర్సీటీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.
రైళ్లల్లో ఆహార సరఫరాను పునరుద్ధరించింది ఐఆర్సీటీసీ. ప్యాంట్రీ కార్ సర్వీస్ ఉన్న అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లల్లోనూ ఇవ్వాళ్టి నుంచి ఆహార సరఫరాను పునరుద్ధరించిట్లు తెలిపింది. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో- ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాజధాని, శతాబ్ది, దురంతో ప్రీమియంతో పాటు 428 రైళ్లల్లో గత సంవత్సరం డిసెంబర్లోనే ఆహార సరఫరాను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 శాతం రైలు సర్వీసుల్లో దీన్ని ఇదివరకే ప్రవేశపెట్టింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కుక్డ్ ఫుడ్ సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత రైలు సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ ఆహార సరఫరా విషయంలో సానుకూల నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. గత సంవత్సరం డిసెంబర్లో దీన్ని సడలించింది. 428 రైలు సర్వీసుల్లో దీన్ని పునఃప్రవేశపెట్టింది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే తేజస్ ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఫుడ్ సప్లైని చేపట్టింది.
ఆ తరువాత ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడం, పైగా దీన్ని పునరుద్ధరించాలంటూ విజ్ఞప్తులు అందడం, కోవిడ్ తీవ్రత తగ్గిపోవడం వంటి పరిస్థితుల వల్ల మిగిలిన అన్ని రైళ్లల్లోనూ ఇవ్వాళ్టి నుంచి పునరుద్ధరించామని ఐఆర్సీటీసీ తెలిపింది. పెళ్లిళ్ల సీజన్ రాబోతోన్నందున..ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటుందనే అంచనా వేస్తున్నామని, దీనికి అనుగుణంగా అదనంగా ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్యాంట్రీ కార్లను అమర్చే దిశగా చర్యలు తీసుకుంటామని వివరించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications