GST On Toilet: టాయిలెట్‌కు వెళ్తే GST వసూలు..! ప్రయాణికులు షాక్.. IRCTC స్పందన..

GST On Toilet: మీరు రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్‌లోని టాయిలెట్‌ని ప్రయాణ సమయంలో లేదా మరొక సమయంలో ఉపయోగించి ఉంటారు. ఈ సర్వీస్ వినియోగించుకున్నందుకు మహా అయితే మీరు రూ.5 లేదా మహా అయితే రూ.10 రుసుముగా చెల్లించి ఉంటారు. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే వార్త వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అవును ఐఆర్సీటీసీ నిర్వాకం గురించి ఇప్పుడు తెలుసుకోండి.

టాయిలెట్ పై జీఎస్టీ..

టాయిలెట్ పై జీఎస్టీ..

టాయిలెట్‌కు వెళ్తే భారీగా GST వసూలు చేసిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ ఘటన ఆగ్రా కాంట్ స్టేషన్‌లో ఈ వ్యవహారం జరిగింది. అక్కడి స్టేషన్ లోని ఎగ్జిక్యూటివ్ లాంజ్ వాష్‌రూమ్‌ను కొన్ని నిమిషాల పాటు ఉపయోగించుకున్నందుకు బ్రిటిష్ ఎంబసీ న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు పర్యాటకు ఒక్కొక్కరికి రూ.112 అంటే రూ.224 చెల్లించాల్సి వచ్చింది.

భారీగా జీఎస్టీ వసూలు..

భారీగా జీఎస్టీ వసూలు..

చెల్లించిన యూజర్ ఛార్జీల మొత్తంలో 6 శాతం SGST, 6 శాతం CGST ఉన్నాయి. టాయిలెట్‌కు వెళ్లేందుకు 12 శాతం జీఎస్టీ విధించారు. టాయిలెట్‌కి వెళ్లడం కూడా ఇంత ఖరీదని రుజువు కావడంలో ఇప్పటివరకు ఇలాంటి కేసు ఇదే తొలిసారి.

IRCTC ఏమని చెప్పింది?

IRCTC ఏమని చెప్పింది?

పర్యాటకులు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌ను ఉపయోగించడం చాలా ఖరీదైనదని భావించారు. విషయం లాంజ్ మేనేజర్‌కు చేరినప్పుడు.. ఈ విషయంలో IRCTC తప్పు లేదని ఆయన చెప్పారు. ఎందుకంటే.. ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో ఉండటానికి 50 శాతం తగ్గింపు తర్వాత కనీస రుసుము రూ.112 చెల్లించడం తప్పనిసరని మేనేజర్ వెల్లడించారు. వాష్‌రూమ్స్ ఉపయోగించినందుకు ప్రత్యేకంగా జీఎస్‌టీ ఉండదని.. వైరల్ అవుతున్న వార్తపై వివరణ ఇచ్చింది. మీడియాలో వస్తున్న వార్తలు తప్పుదారి పట్టిస్తున్నాయని IRCTC వివరణ ఇచ్చింది.

రూ.112కి ఏ సేవలు అందుతాయి..

రూ.112కి ఏ సేవలు అందుతాయి..

IRCTC ప్రకారం.. చెల్లింపు చేసిన తర్వాత ప్రయాణికులు కాంప్లిమెంటరీ కాఫీ గ్రౌండ్‌లో ఇవ్వబడుతుంది. ఇందులో వారు వాష్‌రూమ్‌ని ఉపయోగించవచ్చు. ఉచిత వైఫైని ఉపయోగించవచ్చు. 2 గంటల వరకు ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో ఉండగలరని తెలిపింది. ఈ సమయంలో టీవీతో పాటు ఉచిత మంచినీరు, టీ లాంటివి పొందుతారని రైల్వే వివరించింది.

గతంలో టీ బిల్లు వివాదం..

గతంలో టీ బిల్లు వివాదం..

IRCTC తన సర్వీస్ ఛార్జ్ కారణంగా మొదటిసారి వార్తల్లోకి రాలేదు. గతంలో భోపాల్ శతాబ్ది రైలులో రూ.20 కప్పుపై ఒక వ్యక్తి నుంచి రూ.50 సర్వీస్ ఛార్జీని తీసుకునేవారు. ఆ వ్యక్తి ఒక కప్పు టీకి 70 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. రైల్వే ఈ 'హై-ఫై' సేవకు రుజువుగా, వ్యక్తి ఆ టీ బిల్లును సోషల్ మీడియాలో పంచుకున్నారు. అప్పట్లో రైల్వేలపై అనేక మంది సోషల్ మీడియా వేదికగా స్పందించారు.స

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+