Railway News: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు IRCTC సూపర్ సర్వీస్..

IRCTC News: దేశంలో రైలు ప్రయాణాన్ని ఎప్పటికీ జనాదరణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే సేవలను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ రైల్వేలపై ప్రత్యేక శ్రద్ధ చూపబడుతోంది.

ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైలు ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త 'ఎకానమీ మీల్స్' సౌకర్యాన్ని తెచ్చింది. దీని కింద కేవలం రూ.20కే సరసమైన భోజనాన్ని ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో పొందనున్నారు. జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఇది రూపొందించబడింది. ప్రయాణ సమయంలో రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని పొందటంలో వీరు ఎప్పటి నుంచో సవాళ్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

IRCTC brought 20 rupees economy meal for budget travellers across selected stations

కొత్త భోజన సౌకర్యం బడ్జెట్ ప్రయాణికులకు ఆనందాన్ని కలిగించనుందని తెలుస్తోంది. ముందుగా దీనిని దేశంలోని ఎంపిక చేసిన 100 రైల్వే స్టేషన్లలో దాదాపు 150 ఫుడ్ కౌంటర్ల ద్వారా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి. రానున్న కాలంలో దీనిని మరిన్ని స్టేషన్లకు విస్తరించాలని రైల్వే సంస్థ యోచిస్తోంది. ఈ ఫుడ్ కౌంటర్లలో ప్రయాణికులు రూ.20కి 'ఎకానమీ మీల్స్', రూ.50కి 'స్నాక్ మీల్స్' పొందనున్నారు. ఈ చౌక ఆహార కౌంటర్లు జనరల్ సెకండ్ క్లాస్ - GS కోచ్‌లకు సమీపంలో అందుబాటులో ఉన్నాయి.

తొలివిడతలో ఎంపికైన స్టేషన్లలో హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంఘకల్, తిరుపతి, రాజమండ్రి, విహారాబాద్, బగల, ధోనే, నంద్యాల, పూర్ణ, ఔరంగాబాద్ సహా దక్షిణ మధ్య రైల్వే మార్గంలోని రైల్వే స్టేషన్లలో ఈ ఫుడ్ కౌంటర్లను IRCTC అందుబాటులోకి తీసుకొస్తోంది. రద్దీగా ఉండే ఈ మార్గాల్లో ప్రయాణించే సాధారణ ప్రయాణికుల అవసరాలను ఈ పథకం తీరుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+