ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందంతో భారత్కు జాక్ పాట్! ఎలాగంటే.
గడిచిన మూడు నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం (MoU) పై డిజిటల్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz) మార్గాన్ని తిరిగి తెరవడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ ఇరాన్ అమెరికా (iran us) శాంతి ఒప్పందం వల్ల ప్రపంచ దేశాల కంటే కూడా భారతదేశానికే అత్యధిక లాభాలు కలగబోతున్నాయని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

1. దిగిరానున్న ముడిచమురు (Crude Oil) ధరలు
భారతదేశం తన దేశీయ అవసరాల కోసం దాదాపు 85 శాతం ముడిచమురును ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు శాంతి ఒప్పందం వల్ల ఇరాన్ నుండి మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లోకి భారీగా ఆయిల్ సరఫరా పెరగనుంది. దీనివల్ల యుద్ధ భయాలతో పెరిగిన క్రూడాయిల్ ధరలు (War Premium) ఒక్కసారిగా దిగివస్తాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధరలు తగ్గడం కూడా మొదలైంది. ఇది మన దేశ ఆయిల్ ఇంపోర్ట్ బిల్లును భారీగా తగ్గిస్తుంది. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి తగ్గి, రూపాయి విలువ మరింత బలపడుతుంది.
2. సిలిండర్ల కొరతకు చెక్.. హార్ముజ్ జలసంధి ఓపెన్
ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ రూట్ అయిన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' గుండానే భారత్కు అవసరమైన ముడిచమురు, ఎల్ఎన్జీ (LNG), ఎల్పీజీ (LPG) దిగుమతులు జరుగుతాయి. యుద్ధం వల్ల ఈ మార్గం క్లోజ్ అవ్వడంతో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడి, కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఇప్పుడు ఈ రూట్ ఓపెన్ అవ్వడం వల్ల గ్యాస్ కొరత తీరి, రాబోయే రోజుల్లో సిలిండర్ల ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.
3. ఎగుమతులకు బూస్ట్.. చాబహార్ పోర్ట్ గోల్డెన్ ఛాన్స్
యుద్ధ వాతావరణం వల్ల సముద్ర మార్గాల్లో రవాణా ఖర్చులు (Shipping Costs) విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు టెన్షన్లు తగ్గడంతో ఇండియన్ ఎగుమతిదారులకు మంచి రోజులొచ్చాయి. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటో కాంపోనెంట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాలకు భారీగా లాభాలు ఉంటాయి. దీనికి తోడు, ఇరాన్పై ఆంక్షలు సడలిస్తే.. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'చాబహార్ పోర్ట్' (Chabahar Port) ద్వారా ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియా దేశాలకు పాకిస్తాన్తో సంబంధం లేకుండా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.
4. స్టాక్ మార్కెట్లలో జోష్.. తగ్గు ముఖం పట్టనున్న ద్రవ్యోల్బణం
క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడల్లా భారత స్టాక్ మార్కెట్లకు భారీగా కలిసివస్తుంది. కంపెనీల ఉత్పత్తి ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగి మార్కెట్లలోకి పెట్టుబడులు వస్తాయి. దేశంలో నిత్యావసరాల ధరలు (Inflation) అదుపులోకి వచ్చి ఆర్థిక వృద్ధి రేటు పరుగులు పెడుతుంది.
ఇందులో ఒక చిన్న మెలిక ఉంది!
ఈ పీస్ డీల్ ప్రస్తుతానికి 60 రోజుల గడువు ఉన్న ఒక తాత్కాలిక (Interim) ఒప్పందం మాత్రమే. ఇరాన్ అణు కార్యక్రమం, పూర్తి స్థాయి ఆంక్షల తొలగింపు వంటి కీలకమైన సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. రాబోయే 60 రోజుల్లో జరిగే చర్చలు సఫలమైతేనే ఈ లాభాలన్నీ అందుతాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం మళ్లీ ఆయిల్ ధరలు పెరిగి టెన్షన్లు మొదలయ్యే ప్రమాదం ఉంది. ఏదేమైనా ప్రస్తుతానికైతే ఈ శాంతి ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద బూస్టర్ డోస్ అని చెప్పవచ్చు!


Click it and Unblock the Notifications