లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. చైర్మన్తో పాటు మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ కుమార్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. రాజ్ కుమార్ జనవరి 31న పదవీ విరమణ చేయవలసి ఉంది. అయితే ఆయన పదవిని వచ్చే సంవత్సరం (2023) మార్చి వరకు పొడిగించింది.
ఎల్ఐసీ ఐపీవోకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎంఆర్ కుమార్ పదవీ కాలాన్ని ప్రభుత్వం ఏడాది పొడిగించింది. 2021-2022 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపు ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్న విషయం తెలిసిందే. ఎల్ఐసీ ఐపీవోకు వీలుగా ఎల్ఐసీ కార్పోరేషన్ చట్టానికి ప్రభుత్వం పలు మార్పులు చేసింది.

ఎక్స్చేంజీల్లో నమోదయ్యేందుకు అనువుగా, లిస్టింగ్ నిబంధనలను అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను కూడా నియమించింది. చైర్మన్ పదవీ విరమణ వయసు నిబంధనలు సడలించింది. ఇవి గత ఏడాది జూన్ నుండి అమల్లోకి వచ్చాయి.
ఎల్ఐసీ చైర్మన్ పదవీ కాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి. గత ఏడాది జూన్ నెలలో ఆయన పదవీ కాలాన్ని 9 నెలలు, ఇప్పుడు మరో ఏడాదికి పైగా పొడిగించారు. ఎల్ఐసీలో వాటా విక్రయం ద్వారా రూ.1 లక్ష కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలని భావించింది. కానీ కరోనా నేపథ్యంలో ఈ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. అయితే ఎల్ఐసీ ఐపీవో వస్తే మాత్రం సగం కంటే ఎక్కువ నిధులు సమకూరినట్లే.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications