Foxconn News: దేశంలో ప్రఖ్యాత ఐఫోన్లను తయారు చేయారవుతున్న సంగతి తెలిసిందే. చైనా నుంచి వ్యూహాత్మకంగా ఆపిల్ తన తయారీని భారత్ కు మార్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అది నిలిచిపోయింది.
వివరాల్లోకి వెళితే తైవాన్ టెక్ కంపెనీ ఆపిల్ ఐఫోన్లను మన దేశంలో తయారు చేస్తోంది. అయితే తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్పత్తిని కంపెనీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిన్న ప్రకటించింది. అయితే పరిస్థితులు ఇంకా కొలిక్కి రాకపోవటంతో నేడు సైతం కంపెనీ మెుదటి షిప్ట్ తయారీని రద్దు చేసినట్లు వెల్లడైంది. అయితే ఇవి త్వరలోనే తిరిగి మెుదలవుతాయని తెలుస్తోంది.

తమిళనాడు వ్యాప్తంగా మిచౌంగ్ తుపాను వల్ల కురిసిన కుండపోత వర్షాలతో చెన్నైలోని ఫాక్స్కాన్ ప్లాంట్ వరదల్లో చిక్కుకుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో నీళ్లు మోకాళ్ల లోతుకు చేరుకోవటం రవాణాను అసాధ్యంగా మార్చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఫాక్స్కాన్, పెగాట్రాన్ చెన్నై సమీపంలోని తమ ఫ్యాక్టరీలలో ఐఫోన్ ఉత్పత్తిని తాజాగా నిలిపివేసాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా కీలకమైన రవాణా కేంద్రమైన చెన్నై విమానాశ్రయం రోజంతా కార్యకలాపాలు నిలిపివేయడంతో పరిస్థితి మరింత దిగజారిందని తెలుస్తోంది.
చైనా నుంచి ఐఫోన్ తయారీనీ మార్చాలనే క్రమంలో ఆపిల్ తన ఉత్పత్తిని 2020లో ఇండియాకు షిఫ్ట్ చేసింది. ఇప్పుడు భారతదేశం ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 7 శాతం వాటాను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కంపెనీ తన భారత ఉత్పత్తిని 25 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకునే దిశగా తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications