Multibagger: లక్ష పెట్టుబడిని రూ.1.12 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్.. చమురు వ్యాపారంలో రారాజు..
Multibagger Stock: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే చాలా ఓపికతో పాటు ఫండ్స్ కూడా అవసరం. మార్కెట్లో అనేక కంపెనీల షేర్లు స్వల్పకాలంలో వేగంగా వృద్ధి చెందడం లేదని వాటి ట్రెండ్లో కనిపిస్తోంది. అయితే.. దీర్ఘకాలం పాటు కొనసాగించిన ఇన్వెస్టర్లను మాత్రం ధనవంతులను చేశాయి. అలా మల్టీబ్యాగర్ రాబడులను అందించిన ప్రభుత్వ చమురు కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ప్రభుత్వరంగ చమురు కంపెనీ అయిన IOCL గురించే. ఇండియన్ ఆయిర్ కార్పొరేషన్ కంపెనీ వృద్ధితో పాటు తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను సైతం అందించింది. వారిని ఏకంగా మిలియనీర్లుగా మార్చేసింది. ఈ క్రమంలో గత 20 ఏళ్ల కాలంలో 4 సార్లు బోనస్ షేర్లను అందించింది. షేర్ ఇన్వెస్టర్లకు పెట్టుబడిపై 100 రెట్లు రాబడిని అందించింది.
బోనస్ షేర్ల వివరాలు ఇలా..
గడిచిన 21 ఏళ్లను గమనిస్తే.. కంపెనీ 2009, 2016, 2018, 2022లో తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇచ్చింది. అక్టోబర్ 2009లో మొదటిసారిగా కంపెనీ 1 షేరుకు ఒక షేరు బోనస్ షేరును అందించింది. సుమారు 7 ఏళ్ల తర్వాత 2016లో ఇదే తరహాలో షేరుకు షేరు బోనస్ ప్రకటించింది. ఆ తర్వాత 2018లో కంపెనీ మళ్లీ 1:1 నిష్పత్తిలో బోనస్ని అందించింది. ఈ ఏడాది జూన్లో కంపెనీ 1:2 నిష్పత్తిలో (రెండు షేర్లకు ఒక షేరు) ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇచ్చింది.
బోనస్ మ్యాజిక్ సూపర్..
ఎవరైనా ఇన్వెస్టర్ 21 ఏళ్ల క్రితం రూ.7 చొప్పున లక్ష విలువైన షేర్లను కొనుగోలు చేస్తే వారికి 14,285 షేర్లు వచ్చేవి. అవి నాలుగు సార్లు బోనస్ తర్వాత 14,285 షేర్ల సంఖ్య 1,71,420కి పెరుగుతుంది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఈ షేర్ల విలువ దాదాపు రూ.1.12 కోట్లుగా ఉంది. అంటే దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు లక్ష రూపాయలపై 100 రెట్లు రాబడి లభించింది. లక్ష పెట్టుబడిగా పెట్టిన వారికి కోటి రూపాయలకు పైగా ఆదాయం లభిస్తోంది.