Multibagger Stock: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే చాలా ఓపికతో పాటు ఫండ్స్ కూడా అవసరం. మార్కెట్లో అనేక కంపెనీల షేర్లు స్వల్పకాలంలో వేగంగా వృద్ధి చెందడం లేదని వాటి ట్రెండ్లో కనిపిస్తోంది. అయితే.. దీర్ఘకాలం పాటు కొనసాగించిన ఇన్వెస్టర్లను మాత్రం ధనవంతులను చేశాయి. అలా మల్టీబ్యాగర్ రాబడులను అందించిన ప్రభుత్వ చమురు కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ప్రభుత్వరంగ చమురు కంపెనీ అయిన IOCL గురించే. ఇండియన్ ఆయిర్ కార్పొరేషన్ కంపెనీ వృద్ధితో పాటు తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను సైతం అందించింది. వారిని ఏకంగా మిలియనీర్లుగా మార్చేసింది. ఈ క్రమంలో గత 20 ఏళ్ల కాలంలో 4 సార్లు బోనస్ షేర్లను అందించింది. షేర్ ఇన్వెస్టర్లకు పెట్టుబడిపై 100 రెట్లు రాబడిని అందించింది.

బోనస్ షేర్ల వివరాలు ఇలా..
గడిచిన 21 ఏళ్లను గమనిస్తే.. కంపెనీ 2009, 2016, 2018, 2022లో తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇచ్చింది. అక్టోబర్ 2009లో మొదటిసారిగా కంపెనీ 1 షేరుకు ఒక షేరు బోనస్ షేరును అందించింది. సుమారు 7 ఏళ్ల తర్వాత 2016లో ఇదే తరహాలో షేరుకు షేరు బోనస్ ప్రకటించింది. ఆ తర్వాత 2018లో కంపెనీ మళ్లీ 1:1 నిష్పత్తిలో బోనస్ని అందించింది. ఈ ఏడాది జూన్లో కంపెనీ 1:2 నిష్పత్తిలో (రెండు షేర్లకు ఒక షేరు) ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇచ్చింది.

బోనస్ మ్యాజిక్ సూపర్..
ఎవరైనా ఇన్వెస్టర్ 21 ఏళ్ల క్రితం రూ.7 చొప్పున లక్ష విలువైన షేర్లను కొనుగోలు చేస్తే వారికి 14,285 షేర్లు వచ్చేవి. అవి నాలుగు సార్లు బోనస్ తర్వాత 14,285 షేర్ల సంఖ్య 1,71,420కి పెరుగుతుంది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఈ షేర్ల విలువ దాదాపు రూ.1.12 కోట్లుగా ఉంది. అంటే దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు లక్ష రూపాయలపై 100 రెట్లు రాబడి లభించింది. లక్ష పెట్టుబడిగా పెట్టిన వారికి కోటి రూపాయలకు పైగా ఆదాయం లభిస్తోంది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications