స్టాక్ మార్కెట్ గురువారం కుప్పకూలుతోంది. అంతర్జాతీయ మార్కెట్ బలహీన సంకేతాలతో పాటు ద్రవ్యోల్భణ భయాలు సూచీలను నష్టాల్లోకి తీసుకెళ్తున్నాయి. నేడు భారీ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత అంతకంతకూ పడిపోతున్నాయి. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1300 పాయింట్లు పడిపోయింది. దీంతో 52,000 మార్కు దిగువకు చేరుకుంది. నిఫ్టీ కీలక 15,850 పాయింట్ల దిగువకు వచ్చింది. సూచీలు ఏ దశలోను కోలుకోవడం లేదు. పైగా అంతకంతకూ దిగజారుతున్నాయి.

2.5 శాతం పతనం
ఉదయం దాదాపు 1200 పాయింట్ల (53,070 వద్ద) నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, ఆ తర్వాత స్వల్పంగా కోలుకొని, 53,356 వద్ద ట్రేడ్ అయింది. కానీ అంతకుమించి పుంజుకోలేదు. కాసేపటికే మరింత నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం గం.1.30 సమయానికి సెన్సెక్స్ 2.5 శాతం లేదా 1339 పాయింట్లు క్షీణించి 52,869 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 408 పాయింట్లు క్షీణించి 15,832 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. రెండు సూచీలు కూడా 2.5 శాతం మేర పతనమయ్యాయి.

గంటల్లో రూ.5 లక్షల కోట్లకు పైగా
మార్కెట్లు కుప్పకూలడంతో నేడు ఇన్వెస్టర్ల సంపద భారీగా పడిపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లకు పైగా తగ్గింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ నిన్న రూ.2,55,77,445.81 కోట్లుగా ఉండగా, నేడు రూ.2.50 లక్షల కోట్లకు పడిపోయింది.

అందుకే నష్టాలు
బుధవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆ ప్రభావం ఆసియా, భారత మార్కెట్లపై పడింది. దీనికి తోడు విదేశీ నిధులు వెనక్కి వెళ్లడం మార్కెట్కు మైనస్గా మారింది. చమురు ధరలు కూడా మళ్లీ పెరుగుతున్నాయి. ద్రవ్యోల్భణ ఆందోళనలు కమ్ముకున్నాయి. దీంతో అన్ని రంగాలు నష్టాల్లో ఉన్నాయి. వడ్డీ రేట్ల పెంపు వేగవంతమవుతుందనే అంశం కూడా నష్టాలకు కారణం. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ తగ్గింది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications