నేడు ఒక్కరోజే రూ.6 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి వరకు నాలుగు రోజుల పాటు సూచీలు ఎంత నష్టపోయాయో, నేడు ఒక్కరోజే ఆ మేరకు పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ 200 రోజుల మూవింగ్ యావరేజ్ దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర పతనం కావడంతో ఇన్వెస్టర్లు నేడు ఒక్కరోజే రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు.

ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్న రూ.251.72 లక్షల కోట్లకు తగ్గింది. సోమవారం నాటి మార్కెట్ క్యాప్‌తో పోలిస్తే ఇది రూ.5.67 లక్షల కోట్లకు పైగా తక్కువ. ఫిబ్రవరి 16వ తేదీన క్లోజింగ్ వ్యాల్యూ రూ.262.19 లక్షల కోట్లు. కాగా, నిన్నటి వరకు వరుసగా నాలుగు రోజుల పాటు నష్టాల్లో ముగియడం, నేడు సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లు పడిపోవడంతో ఈ కొద్ది సెషన్‌లలోనే ఇన్వెస్టర్లు రూ.10.46 లక్షల కోట్లు నష్టపోయారు.

 investors lose Rs 6 lakh crore today as Sensex, Nifty slip below 200 DMAs

సెన్సెక్స్ మధ్యాహ్నం గం.1 సమయానికి 972.77 పాయింట్లు లేదా 1.69 శాతం లాభపడి 56,708.39 పాయింట్ల వద్ద, నిఫ్టీ 296.20 పాయింట్లు లేదా 1.72 శాతం క్షీణించి 16,912.05 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ నేడు ఓ సమయంలో దాదాపు 1300 పాయింట్ల మేర క్షీణించింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ, భారీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+