Tata IPO: రెండు దశాబ్ధాల తర్వాత టాటాల నుంచి వచ్చిన ఐపీవో ఇన్వెస్టర్లను లాభాల్లో ముంచేసింది. తొలిరోజే ఏకంగా ఇష్యూ ధర కంటే 140 శాతం లాభాలతో ప్రీమియం ధర వద్ద స్టాక్ మార్కెట్లో జాబితా చేయబడింది.
టాటా టెక్నాలజీస్ ఐపీవో పెట్టుబడిదారులకు ఊహించని లాభాలను తొలిరోజే అందించి లాభాల పంట పండించింది. చాలా కాలం ఎదురుచూపుల తర్వాత నేడు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో షేర్ జాబితా అయ్యింది. స్టాక్ 140 శాతం అద్బుత ప్రీమియం రేటు రూ.1199.95 వద్ద BSEలో, రూ.1200 రేటు వద్ద ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యాయి. షేర్లు లిస్టింగ్ అయిన కొద్దిసేపటికే బీఎస్ఈలో స్టాక్ ధర ఇష్యూ రేటు కంటే దాదాపు 180% పెరిగి రూ.1,398కి చేరుకున్నాయి.

వాస్తవానికి టాటా టెక్నాలజీస్ ఐపీవో కోసం తన షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.475-500గా ప్రకటించింది. అయితే తొలిరోజు నుంచే ఇష్యూ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందనను పొందింది. దీంతో గ్రేమార్కెట్లో భారీగా ప్రీమియం కూడా పెరిగింది. అయితే నేడు మార్కెట్లో బలమైన లాభాలను పెట్టుబడిదారులకు అందించింది. ఇది 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టాటా గ్రూప్ నుంచి వచ్చిన ఐపీవో కావటంతో అత్యధికంగా ఇన్వెస్టర్లను ఆకర్షించింది. దీనికి ముందు చివరిగా 2004లో టీసీఎస్ ఐపీవో టాటాల నుంచి వచ్చింది.
రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం ఐపీవో నవంబర్ 22న ప్రారంభమై నవంబర్ 24న ముగిసింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.3,042 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. టాటా టెక్ IPO 6.09 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ను కలిగి ఉంది. ఇందులో ప్రమోటర్ టాటా మోటార్స్ లిమిటెడ్ ద్వారా 46,275,000 షేర్లను, ఇన్వెస్టర్ ఆల్ఫా TC హోల్డింగ్స్ 9,716,853 షేర్లను, టాటా క్యాపిటల్ గ్రోత్ 4,858,425 షేర్లను విక్రయించాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications