అమెరికా ప్రభుత్వం ఇంటెల్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఇంటెల్లో దాదాపు 10 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది. ఈ ఒప్పందం కింద డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 8.9 బిలియన్ డాలర్లు (సుమారు 74 వేల కోట్లు) పెట్టుబడి కంపెనీలో పెట్టింది. శుక్రవారం (US సమయం ప్రకారం) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇంటెల్ ఇద్దరూ కలిసి ఈ ఒప్పందంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ సోషల్ పోస్టులో ఈ పెట్టుబడిని ఒక అధ్భుతమైన విజయంగా అభివర్ణించారు. ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాకు చెందిన ఐటీ చిప్ మేకర్ దిగ్గజం ఇంటెల్లో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం 10 శాతం వాటాను అధికారికంగా కలిగి ఉంది. ఈ షేర్లను అమెరికా కోసం ఎటువంటి ఖర్చు లేకుండానే పొందగలిగామని తెలిపారు. వాటి విలువ ప్రస్తుతం 11 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది అమెరికాకు - ఇంటెల్కు అద్భుతమైన ఒప్పందమని పేర్కొన్నారు.
అమెరికా జాతీయ భద్రత, సాంకేతిక ఆధిపత్యం కోసం సెమీకండక్టర్లు ఎంతో ముఖ్యమైనవి. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ వ్యవస్థలు వంటి రంగాల్లో ఈ చిప్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటెల్లో వాటా సాధించడం ట్రంప్ వ్యూహంలో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు. యుఎస్ ప్రభుత్వం మొత్తం 433.3 మిలియన్ షేర్లను ఒక్కొక్కటి 20.47 డాలర్ల ధరకు కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడికి నిధులు బైడెన్ కాలం నాటి CHIPS & Science Actలో మిగిలిన గ్రాంట్లు, పెంటగాన్ Secure Enclave Program కింద 3.2 బిలియన్ డాలర్ల కేటాయింపు ద్వారా సమకూరాయి.

గణనీయమైన వాటా ఉన్నప్పటికీ.. ఇంటెల్ చేసే వ్యవహారాల్లో అమెరికా ప్రభుత్వానికి ఎటువంటి ప్రత్యక్ష పాత్ర ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ఈ పెట్టుబడికి బోర్డు ప్రాతినిధ్యం లేదా నిర్ణయాధికారం లేవని, కేవలం పెట్టుబడిదారుగా మాత్రమే ప్రభుత్వం వ్యవహరిస్తుందని ట్రంప్ తెలియజేశారు.
ఇంటెల్ CEO లిప్-బు టాన్ మాట్లాడుతూ.. అమెరికన్ తయారీని బలోపేతం చేయడం, అత్యాధునిక సాంకేతికతలను దేశంలోనే ఉంచడం మా ప్రధాన లక్ష్యంగా చెప్పారు. పెట్టుబడి మాకు మరింత స్థిరత్వాన్ని ఇస్తుందన్నారు.
టాన్ మార్చిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత Intel కంపెనీని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల ఉద్యోగులలో 15 శాతం తగ్గింపు ప్రకటించినప్పటికీ, ఈ ఒప్పందం తర్వాత కంపెనీపై పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది.ఈ ప్రకటన వెలువడిన తర్వాత శుక్రవారం ఇంటెల్ షేర్ ధర 7 శాతం పెరిగింది.పెట్టుబడిదారులు ఈ ఒప్పందాన్ని స్థిరీకరణ శక్తిగా భావిస్తున్నారనే సంకేతంగా దీనిని చెప్పుకోవచ్చు. ఇక జపాన్కు చెందిన SoftBank కూడా ఇంటెల్లో 2 బిలియన్ల డాలర్ల పెట్టుబడిని ప్రకటించింన సంగతి విదితమే.
ప్రస్తుతం సెమీకండక్టర్ల రంగంలో ప్రధాన కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. తైవాన్ TSMC, దక్షిణ కొరియా Samsung వంటి కంపెనీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇంటెల్ ఒప్పందం అమెరికా టెక్నాలజీ భవిష్యత్తును బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ట్రంప్ టెక్ కంపెనీలతో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే Nvidia, AMD కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, ఈ కంపెనీలు చైనా సంబంధిత విక్రయాల్లో కొంత భాగాన్ని అమెరికా ప్రభుత్వంతో పంచుకోవాలని అంగీకరించాయి.
More From GoodReturns

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

Iran war: యుద్ధం ఎప్పుడు ఆపాలో మేమే తేలుస్తాం.. ఇరాన్ అమెరికా మధ్య ముదురుతున్న మాటల యుద్ధం!

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..



Click it and Unblock the Notifications