కరోనా కేసులు పెరుగుతుండటంతో కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల కాలపరిమితిని పెంచే దిశగా ఇన్సురెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోంది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది జూలై 10వ తేదీన 3.5 నెలలు, 6.5 నెలలు, 9.5 నెలల కాలపరిమితితో బీమా కంపెనీలు ఈ పాలసీలను విక్రయించేందుకు ఇన్సురెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) గతంలో అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు కరోనా ప్రత్యేక పాలసీల ద్వారా 15 లక్షల మందికి పైగా ఈ బీమా సదుపాయాన్ని వినియోగించుకున్నారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల కాలపరిమితిని పెంచే దిశగా ఇన్సురెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోంది. అంతేకాదు, ఈ పాలసీలను మెయిన్స్ట్రీమ్లోకి తీసుకు రావడమే కాకుండా రెన్యువల్ చేస్తే విషయాన్ని పరిశీలిస్తోంది. కరోనా కవచ్ పాలసీ సమ్ అస్యూర్డ్ రూ.50వేల నుండి రూ.5 లక్షల వరకు ఉంది. కరోనా రక్షక్ ఫిక్స్డ్ బెనిఫిట్ ప్లాన్. కరోనా కవచ్ పాలసీకి ఎక్కువగా ఆదరణ లభిస్తోంది.

వచ్చే ఏడాది మార్చి చివరి దాకా ఈ పథకాలు అమల్లో ఉంటాయి. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి తర్వాత కూడా ఈ పాలసీల చెల్లుబాటును పొడిగించే అవకాశాలున్నాయని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా చెబుతున్నారు. త్వరలో మార్గదర్శకాలు మార్గదర్శకాలు రానున్నాయని తెలుస్తోంది. కరోనా కవచ్ పాలసీ ప్రతివారం 15 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తోంది. సాధారణ బీమా కంపెనీలు ఈ నెల 10వ తేదీ నాటికి రూ.3,255 కోట్ల 2.07 లక్షల క్లెయిమ్స్ క్లియర్ అయ్యాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications