దివాలా చట్టంతో చాలా కంపెనీలు గట్టెక్కాయి: నిర్మలా సీతారామన్

దివాలా చట్టం అస్త్రంగా మూసివేయించిన కంపెనీల కంటే కాపాడిన కంపెనీలే ఎక్కువ అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వీలైనంత వరకు వ్యాపారాలు కొనసాగించుకునేలా చూడడమే తమ ఉద్దేశ్యం అన్నారు. వాస్తవానికి 258 కంపెనీలు దివాలా తీయకుండా ఈ చట్టం కాపాడిందని, 965 సంస్థలు మాత్రం దివాలాకు వెళ్లాయన్నారు.

కాపాడిన ఈ కంపెనీల వ్యాల్యూ రూ.96 వేల కోట్లుగా ఉందని, దివాలాకు వెళ్లిన కంపెనీల వ్యాల్యూ రూ38వేల కోట్లుగా ఉందని నిర్మల తెలిపారు. దివాలాకు వెళ్లిన కంపెనీల కంటే దివాలాకు వెళ్లకుండా ఉన్న కంపెీల ఆస్తుల విలువే ఎక్కువగా ఉందన్నారు. శనివారం రాజ్యసభ మూజువాణి ఓటుతో దివాలా చట్టం (రెండో స్వరణ) బిల్లు 2020ని ఆమోదించింది.

Insolvency proceedings against corporate debtors, personal guarantors can go together

ఇదిలా ఉండగా, రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతిచ్చింది. ఈ బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించి, దళారీ వ్యవస్థకు ముగింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.

ఆదివారం సభలో జరిగిన వ్యవసాయ బిల్లులపై చర్చలో పాల్గొన్నారు. పంటలకు ముందుగానే ధర నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని, దళారీల ఆగడాల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందని విజయసాయి అన్నారు. మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+