మాకు 12 వేల మంది ఫ్రెషర్లు కావాలి..టీసీఎస్ లేఆప్స్ వేళ ఇన్ఫోసిస్ కీలక ప్రకటన..

Infosys Hiring News: భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ 12 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించి టెక్ రంగంలో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి విదితమే. ఈ ఉద్యోగ తొలగింపుల నిర్ణయం ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిల్లోని ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని టీసీఎస్ కంపెనీ పేర్కొంది.ఐటీ రంగంలో చాలా మార్పులు వస్తున్నాయని.. కృత్రిమ మేధ, ఆపరేటింగ్ మోడల్ మార్పులు ఇలా కొత్త సాంకేతికత పుట్టుకొచ్చిందని తెలిపారు. అందుకు అనుగుణంగానే ఎవరైనా నడుచుకోవాలని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే.కృతివాసన్ తెలిపారు.

అయితే ఈ సమయంలో ఇన్ఫోసిస్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. భారీగా హైరింగ్‌కు సిద్ధమవుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని వెలువరించింది. ఈ కథనం ప్రకారం.. AI & రీస్కిల్లింగ్‌పై దృష్టి పెడుతున్నామని ఇందులో భాగంగానే భారీగా హైరింగ్‌కు సిద్ధమవుతున్నామని సీఈఓ తెలిపారు.

Infosys Hiring News Infosys has made a key announcement The company has said that it is preparing for a massive hiring spree CEO Salil Parekh said that it aims to hire around 20 000 graduates this fiscal year

సీఈఓ మాట్లాడుతూ.. మేము మొదటి త్రైమాసికంలోనే 17 వేల మందికి పైగా నియమించుకున్నాం. మొత్తం సంవత్సరానికి 20 వేల మంది కళాశాల విద్యార్థులను నియమించుకోవాలని భావిస్తున్నామని పరేఖ్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో అస్థిరత ఉన్న సమయంలో ఈ ప్రకటన యువతకు కొత్త ఆశలు కలిగిస్తోంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ తన వ్యూహాత్మక దృష్టిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రీస్కిల్లింగ్ పై కేంద్రీకరించింది. ఇప్పటివరకు సంస్థ 2.75 లక్షల మంది ఉద్యోగులకు రీస్కిల్లింగ్ శిక్షణ అందించిందని సీఈఓ తెలిపారు. AI వల్ల ఆటోమేషన్ డెవలప్ అవుతుందని తెలిపిన ఆయన..ఉన్నత స్థాయి నైపుణ్యాల అవసరం కూడా పెరుగుతుందని అన్నారు.

TCS 12 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించిన తరుణంలో ఇన్ఫోసిస్ నుంచి వచ్చిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. టీసీఎస్ 12 వేల ఉద్యోగాలతో ఐటీ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది. భారతీయ ఐటీ సంస్థలు ఇప్పటివరకు ఈ స్థాయిలో ఉద్యోగ కోతలు జరిపిన దాఖలాలు లేవని టెక్ నిపుణులు చెబుతున్నారు.నాస్కామ్ తాజా ప్రకటన ప్రకారం.. ఐటీ రంగం సమీప భవిష్యత్తులో అనేక ఒడిదుడుకులకు లోనవుతుందని స్పష్టం చేసింది. ఆటోమేషన్, గ్లోబల్ క్లయింట్ల డిమాండ్ పెరుగుదల, వేగవంతమైన డెలివరీ మోడళ్లవైపు మొగ్గు తదితర అంశాలు ఉద్యోగ తొలగింపుల ప్రధాన కారణాలుగా తేల్చింది.

ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ.. AI ఆధారిత ఆటోమేషన్ వల్ల కోడింగ్ లో 5 శాతం నుండి 15 శాతం వరకు ఉత్పాదకత పెరుగుతోందని పరేఖ్ తెలిపారు. ఉద్యోగుల పర్యవేక్షణతో కూడిన ఆటోమేషన్ వల్ల దాదాపు 20 శాతం ఉత్పాదకత మెరుగుదల సాధ్యమవుతుందని తెలిపింది. ఇక వేతనాలపై ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన Q4, Q1 లో వేతనాల పెంపు ప్రక్రియ పూర్తయిందని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం తదుపరి పెంపు చక్రాన్ని ప్రారంభించే సమయం పై పరిశీలన జరుగుతోందని అన్నారు. సంస్థ తగిన సమయంలో ఈ విషయం ప్రకటించనుందని స్పష్టం చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+