చెక్ రిపబ్లిక్ గైడ్‌విజన్‌ను కొనుగోలు చేయనున్న ఇన్ఫోసిస్, షేర్ జూమ్

ఇండియన్ సాఫ్టువేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ చెక్ రిబబ్లిక్‌కు చెందిన కన్సల్టెన్సీ కంపెనీ గైడ్ విజన్‌ను కొనుగలు చేయనుంది. 30 మిలియన్ యూరోలకు (రూ.260 కోట్లకు పైగా) మొత్తంతో దీనిని స్వాధీనం చేసుకోనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. తమ అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ కంపెనీ ఈ స్వాధీనం చేపడుతుందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్ నాటికి ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి కావొచ్చునని వెల్లడించింది.

ఐటీ ప్రాసెస్‌తో పాటు సంక్లిష్ట వ్యాపార వ్యవహారాల్ని సరళతరం చేసే సర్వీస్ నౌ టూల్, స్నోవిజన్ గైడ్‌విజన్‌కు ఉన్నాయి. గైడ్ విజన్ వందకు పైగా కంపెనీలకు సేవలు అందిస్తోంది. డిజిటల్ వర్క్ నిర్వహించే కంపెనీలకు సాయం చేసే క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్స్‌ని అభివృద్ధి చేస్తుంది సర్వీసెస్ నౌ. క్లౌడ్ ఆధారిత సేవలకు మారే సంస్థలకు ఇన్ఫోసిస్ అందిస్తోన్న కోబాల్ట్ సేవల బలోపేతానికి గైడ్ విజన్ స్వాధీనత మరింత ఉపకరిస్తుందని ఇన్ఫోసిస్ క్లౌడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రావు తెలిపారు.

Infosys to acquire GuideVision for up to 30 million euros

గైడ్ విజన్‌ను ఇన్ఫోసిస్ కొనుగోలు చేస్తుందనే ప్రకటన నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు రెండు రోజులుగా ఎగిసిపడుతున్నాయి. నిన్న ఐటీ దిగ్గజాల షేర్లు అన్నీ దూసుకెళ్లాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ ధర ఏకంగా 9.89 శాతం ఎగిసి రూ.793 వద్ద, విప్రో షేర్ ధర 4.36 శాతం ఎగిసి రూ.306 వద్ద, టీసీఎస్ షేర్ ధర 4.67 శాతం ఎగిసి రూ.2,485 వద్ద, టెక్ మహీంద్రా షేర్ ధర 3.25 శాతం ఎగిసి రూ.790 వద్ద క్లోజ్ అయింది. అలాగే ఇన్ఫోసిస్ షేర్ ధర 3.10 శాతం ఎగిసి రూ.975 వద్ద క్లోజ్ అయింది. అయితే ఈ రోజు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు ప్రారంభంలో నష్టాల్లో ఉండగా, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+