Infosys News: దేశంలోని రెండవ అగ్రగామి టెక్ కంపెనీల్లో ఒకటి ఇన్ఫోసిస్. ఇందులో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు కంపెనీ చెప్పిన మాట నిలబెట్టుకుంటుందా.. లేదా అనే ఆందోళనలో ఉన్నారు.
ఇన్ఫోసిస్ సెప్టెంబర్ 29 నుంచి 'పెర్ఫార్మెన్స్ రివ్యూ సైకిల్ అక్టోబర్ 2023'ని ప్రారంభించబోతోంది. కంపెనీ మేనేజర్లకు అంతర్గతంగా పంపిన ఈ-మెయిల్ విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల పనితీరును రేపటి నుంచి లెక్కించనున్నారు. దీనికి సంబంధించిన రేటింగ్లు డిసెంబర్ మొదటి వారంలోపు వ్యక్తిగత ఉద్యోగులకు తెలియజేయబడతాయి. అయితే గడచిన త్రైమాసికానికి సంబంధించిన జీతాల పెంపులు ఇంకా చెల్లించలేదని కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులు ఎకనామిక్ టైమ్స్ కి వెల్లడించారు.

సెప్టెంబరుతో రెండవ త్రైమాసికం ముగుస్తూ కొత్త అప్రైజల్ సైకిల్ మెుదలవుతున్నప్పటికీ టెక్ దిగ్గజం గతంలో ఇవ్వాల్సిన హైక్స్, ఇంక్రిమెంట్లను చెల్లించలేదని ఉద్యోగులు వాపోతున్నారు. అక్టోబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు టెక్కీలు జీతం పెంపును పొందలేదు.ఇది కాకుండా పెండింగ్లో ఉన్న పెంపు నుంచి వచ్చే డబ్బు రాబోయే ఇంక్రిమెంట్ సైకిల్తో కలుపబడుతుందా లేదా వదిలివేయబడుతుందా అనే దానిపై కూడా ఉద్యోగులకు స్పష్టత లేదు.
సాధారణంగా జూన్-జూలై నెలల్లో కంపెనీలు పనితీరు ఆధారంగా పెంచిన జీతాలను ఉద్యోగులకు అందిస్తుంటాయి. అయితే ఒక ఉద్యోగి వెల్లడించిన సమాచాం ప్రకారం.. సెల్ఫ్ అచీవ్మెంట్స్, పర్ఫామెన్స్ త్వరలో అందించాల్సి ఉందని తెలిపారు. గత ఏడాది కూడా ఈ ప్రక్రియ జరిగిందని, రేటింగ్స్ కూడా ఇచ్చారని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన పెంచిన జీతాలు ఇప్పటి వరకు అందలేదని వెల్లడించాడు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వార్షిక వేతనాల పెంపును పరిశీలిస్తున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ తెలిపారు. వ్యాపార అనిశ్చితులు, సవాళ్లు కొనసాగుతున్న వేళ మరికొన్నాళ్లు ఐటీ పరిశ్రమ ఒడిదొడుకుల్లో ఉంటుందని అన్నారు. కంపెనీల ఆదాయాలు, వ్యాపార మార్జిన్లు సైతం భారీగా ప్రభావితం కావటంతో వేతనాల పెంపులను కంపెనీలు తాత్కాలికంగా వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈసారైనా ఇచ్చిన మాట కంపెనీలు నిలబెట్టుకుంటుంతో లేదో చూడాలి.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications