Narayana Murthy: దేశంలో రెండవ అతిపెద్ద టెక్ కంపెనీ సహవ్యవస్థాపకుడుగా ఉన్న నారాయణ మూర్తి ప్రస్తుతం తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. దేశాభివృద్ధి, విద్య, వైద్యం, ఎంటర్ప్రెన్యూర్ షిప్, యువత పని గురించి అనేక అంశాలపై ఆయన చేస్తున్న కామెంట్స్ ప్రతి ఒక్కరినీ దేశంలో ఆలోచింపజేస్తున్నాయి.
సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా మారటం లేదా ఫైనాన్షియల్ అనలిస్ట్ కావడం సులువునేనని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. అయితే కంపెనీలను స్థాపించటం వాటిని విజయవంతంగా నడపటం, ఒడిదొడుకులను ఎదుర్కొని విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలవటం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. అసలు ముందు వ్యాపారవేత్తగా మారాలంటే రిస్క్ తీసుకునే యువతకు బాసటగా నిలిచేలా మన సమాజంలో మార్పులు రావాలంటూ మూర్తి సంచలన కామెంట్స్ చేశారు.

80వ దశకంలో కేవలం 6 మంది ఇంజనీర్లు కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించినట్లు మూర్తి వెల్లడించారు. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది యువత వ్యాపారవేత్తలుగా మారుతున్నారని.. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ముఖ్యంగా సమస్యలను పరిష్కరించాలనే ఉత్సాహం నేటి యువతలో అధికంగా ఉందని పేర్కొన్నారు.
దీనికి ముందు కొన్ని వారాల కిందట ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారతీయ యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని పేర్కొన్నారు. అయితే దీనిని కొందరు స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు సమర్థించగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. నేటి యువత హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని అనేక మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications