ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి గతంలో వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆయన మరోసారి పని గంటల గురించి ప్రస్తావించారు. చైనా ఎకానమీ గురించి మాట్లాడుతూ ఇండియా చైనాను దాటాలంటే యువత ఎలా పని చేయాలో వివరించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

యువత వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పి సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఈసారి చైనాలో ఒకప్పుడు అమల్లో ఉన్న 9-9-6 పని విధానాన్ని గురించి ప్రస్తావించారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే యువత ఎక్కువ గంటలు పనిచేయడం తప్పనిసరి అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చైనా అనుసరించిన కఠినమైన పనివిధానాల వల్లే ఆ దేశం చాలావేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. చైనాలో ఒకప్పుడు 9-9-6 అనే మోడల్ ను ఫాలో అయ్యేవాళ్లని, దానివల్లే ఆ దేశ ఎకానమీ చాలా వేగంగా డెవలప్ అయిందని చెప్పారు.
9-9-6 అంటే..
9-9-6 అంటే.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారానికి 6 రోజుల పాటు పనిచేయడం. ఒకప్పుడు చైనాలోని ఉద్యోగులు ఇదే నియమాన్ని ఫాలో అయ్యేవాళ్లు. ఈ నియమం ప్రకారం పని గంటలు లెక్కేస్తే.. మొత్తం కలిపి వారానికి 72 గంటల పని అవుతుంది. దీంతో ఆయన మరోసారి 70 గంటల పని విధానాన్ని సమర్థించినట్టయింది. దేశంలోని వర్క్ కల్చర్ లో మార్పు అవసరమని చెప్పడానికి చైనా పని నియమమే ఉదాహరణ అని మరోసారి స్పస్టం చేశారు.
చైనాతో పోటీ పడాలంటే..
మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో భారత్ చైనాను అధిగమించగలదా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అది సాధ్యమే కానీ, దానికి చాలా నిబద్ధత అవసరం అని చెప్పారు. ప్రస్తుతం చైనా ఎకానమీ మనకంటే ఆరు రెట్లు పెద్దదని. వారితో పోటీ పడాలంటే ప్రతి ఒక్కరూ అసాధారణంగా కృషి చేయాలని ఆయన చెప్పుకొచ్చారు.
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కంటే ముందు..
యువత వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆలోచించే ముందు తమ కెరీర్ను నిర్మించుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని నారాయణ మూర్తి అన్నారు. ప్రతి పౌరుడు, ఉద్యోగి, రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త.. ఇలా ప్రతి ఒక్కరూ తమకు తాము హై స్టాండర్డ్స్ ను నిర్దేశించుకున్నప్పుడే భారత్ చైనాను అందుకోగలదు అని ఆయన అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారానికి 100 గంటలు పనిచేస్తారని కూడా గుర్తు చేశారు.
సోషల్ మీడియా రెస్పాన్స్
నారాయణ మూర్తి కామెంట్స్ పై మరోసారి సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. నారాయణ మూర్తి వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. దేశంలో చాలామంది తక్కువ మౌలిక సదుపాయాలు, ఎక్కువ ఖర్చులతో జీవిస్తున్నారని కొందరు.. చైనా స్థాయిలో జీతాలు, మౌలిక సదుపాయాలు అందించిన తర్వాత పని గంటలపై మాట్లాడాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications