Infosys News: ఐటీ సేవల కంపెనీ సహవ్యవస్థాపకుడిగా ఉన్న నారాయణమూర్తి తన ప్రయాణంలో ఎదుర్కొన్న పరిస్థితులను పంచుకున్నారు. కంపెనీ కోసం ఆయన పడిన కష్టాలను దీని ద్వారా గుర్తించవచ్చు.
ఇన్ఫోసిస్ ప్రారంభించిన తొలినాళ్లలో నారాయణమూర్తి ఒక క్లయింట్ కోసం అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో ఆయన అక్కడ ఒక కిటికీలు లేని స్టోర్రూమ్లో అట్టపెట్టెపై పడుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. వాస్తవానికి క్లయింట్ సొంత ఇంటిలో నాలుగు బెడ్రూమ్లు ఉన్నాయని జగ్గర్నాట్ బుక్స్ ప్రచురించిన "యాన్ అన్కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి" పుస్తకం వెల్లడించింది.

ఇక్కడ అమెరికాకు చెందిన క్లయింట్ డాన్ లిలెస్. అతను న్యూయార్క్కు చెందిన కంపెనీ డేటా బేసిక్స్ కార్పొరేషన్కు నాయకత్వం వహించేవాడు. అతను కావాలనే కొన్ని సందర్భాల్లో నారాయణ మూర్తిని తక్కువచేసి చూసేవాడని వెల్లడైంది. అలాగే కంపెనీ చెల్లింపులను వీలున్నప్పుడల్లా ఆలస్యం చేసేవాడు. అలాగే మూర్తి, ఇన్ఫోసిస్ సహచరులు మాన్హట్టన్లో అతనిని సందర్శించవలసి వచ్చినప్పుడు హోటల్లను బుక్ చేసుకోవడానికి సకాలంలో అధికారాన్ని అందించేవాడు కాదని పుస్తకం తేటతెల్లం చేసింది.
డాన్ ప్రవర్తన సరిగాలేనప్పటికీ కంపెనీ ఎదుగుతున్న ప్రారంభ దశల్లో నారాయణమూర్తి సహించారు. అయితే బాక్స్ సంఘటన మూర్తిని నిజంగా షాక్ చేసింది. అతిథిని భారతదేశంలో ప్రజలు చాలా గౌరవంగా చూస్తుంటారు. అయితే దీనిని సుధా మూర్తి తప్పుపట్టారు. ఎవరైనా ముందస్తు సమాచారం లేకుండా ఇంటికి వచ్చినప్పుడు సుధా తండ్రి తన ఆహారాన్ని వారికి అందించటంతో పాటు రాత్రికి భోజనం చేయకుండానే నిద్రించేవాడని ఆమె గుర్తుచేసుకున్నారు. దీంతో డాన్ ప్రవర్తన ఆమెను నిజంగా కోపానికి గురిచేసింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications