IT News: సరికొత్త చరిత్ర సృష్టించనున్న Infosys.. ఇక Cognizant ఔట్, ఇదేందిరా సామీ..!!

Infosys Vs Cognizant: భారతీయ టెక్ కంపెనీలు ప్రపంచ స్థాయిలో తన సత్తా చాటుతున్నాయి. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ భారతదేశంలో అతిపెద్ద టెక్ ఆటగాళ్లలో ఒకటిగా ఉంది. కంపెనీ ఎక్కువ మంది ఉద్యోగులను ఇండియాలోనే హోల్డ్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీని ఒక భారతీయ సంస్థ అధిగమించటంతో కొత్త చరిత్రకు నాంది పలికింది.

కాగ్నిజెంట్ అంచనా వేసిన ఆదాయాలను అధిగమించి భారతదేశపు 2వ అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టైటిల్‌ను తిరిగి పొందేందుకు ఇన్ఫోసిస్ రేసులో ముందు వరుసలో ఉంది. మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రస్తుతం దేశంలో అతిపెద్ద టెక్ కంపెనీగా టాటా గ్రూప్ సంస్థ టీసీఎస్ తొలి స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆదాయం 3.8 శాతం పెరిగి దాదాపు 5 బిలియన్ డాలర్ల దగ్గరకు చేరుకుంది. అలాగే ఇన్ఫోసిస్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఏడాదికి 25.2 శాతం పెరుగుదలను సాధించింది. సలీల్ పరేఖ్ నేతృత్వంలో కంపెనీ తిరిగి తన పూర్వ వైభవానికి వేగంగా చేరుకుంటోంది.

Infosys is on track to reclaim the title of India s second-largest IT company

ఇదే క్రమంలో భారతీయ టెక్ కంపెనీలతో పోటీ పడలేకపోవటానికి అత్యున్నత సారధులు గడచిన 7 ఏళ్లలో మూడు సార్లు మారటమే. ప్రస్తుతం కంపెనీని భారత సంతతికి చెందిన సీఈవో ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. తరచుగా మేనేజ్మెంట్ మారటం వల్ల అస్థిరత ఏర్పడటం కంపెనీ వృద్ధిని భారీగా ప్రభావితం చేసింది. దీనికి ముందు కొన్ని నెలల కిందట టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ బెల్కాన్‌ను 1.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం దాని ఆర్థిక, వ్యూహాత్మక చిక్కులకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. వాస్తవానికి ఇది కంపెనీ చేపట్టిన రెండవ అతిపెద్ద కొనుగోలుగా నిలిచింది.

ఈ క్రమంలో కాగ్నిజెంట్ త్రైమాసిక ప్రాతిపదికన 3,300 మంది ఉద్యోగులను తగ్గించగా.. ఏడాది ప్రాతిపదికన 7,100 మందిని తగ్గించింది. మెుదటి త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,44,400 మందిగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో కాగ్నిజెంట్ యుటిలైజేషన్ రేషియో 1 శాతం పెరిగి 82 శాతానికి చేరుకుంది.

ఇదే క్రమంలో కంపెనీ అట్రిషన్ రేటు 13.1 శాతానికి తగ్గింది. కాగ్నిజెంట్ 2024లో ఊహించిన దానికంటే తక్కువ ఆదాయాన్ని అంచనా వేసింది. పలువురు సీనియర్-స్థాయి ఎగ్జిక్యూటివ్‌ల నిష్క్రమణను కూడా కంపెనీ వెనుకబడటానికి దారితీసింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లపై మార్కెట్లో ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోంది. కరోనా తర్వాత అమెరికాలో సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించటంతో ఐటీ పరిశ్రమ మెల్లగా పుంజుకుంటూ మంచిరోజులు మెుదలయ్యాయని జాబ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+