Infosys News: ఇంటి నుంచి పనికి స్వస్తి పలికి ఆఫీసులకు రావాలంటూ ఉద్యోగులకు TCS ఇటీవల హుకుం జారీ చేసింది. అయితే అదే బాటలో కాకుండా కొంచెం డైవర్షన్ తీసుకోవాలని దేశంలో రెండో అతిపెద్ద IT సేవల సంస్థ ఇన్పోసిస్ భావిస్తోంది. తన సిబ్బందికి కొంతమేర వెలుసులుబాటు ఇవ్వాలని చూస్తోంది. ఇదికాస్తా ఉద్యోగులకు వరం కానుంది.
ఉద్యోగులను ఒకేసారి కంపెనీకి తిరిగి రమ్మనేందుకు బదులుగా కొంత మృదువుగా వారితో వ్యవహరించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింంది. ఇందుకోసం సిబ్బందికి సౌకర్యవంతమైన విధానాన్ని అనుసరించాలని చూస్తోంది. ఉద్యోగులకు రిమోట్ వర్క్ ఆప్షన్ను ఆఫర్ చేస్తోంది. తద్వారా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తో పాటు సిబ్బందిపై ఒత్తిడి తగ్గించినట్లు అవుతుందని భావిస్తోంది.

2022 కొవిడ్ సమయంలో కంపెనీకి చెందిన 97 శాతం మంది ఇంటి నుంచి పనిచేయగా.. FY23లో 75 శాతం మంది ఆ ఆప్షన్ వినియోగించుకున్నారు. ఇక FY24లో దాదాపు 84 శాతం మంది రిమోట్గా పనిచేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ ట్రెండ్ మళ్లీ పెరుగుతున్నట్లు తెలుస్తోందని ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.
రిమోట్ వర్క్ కోసం పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా స్వస్థలాలలో ఉండి పనిచేయాలనుకునే ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మద్దతు ఇస్తోంది. ఇందుకుగాను టైర్-2 నగరాల్లో తన ఉనికిని విస్తరిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం మరియు కోయంబత్తూరులో కొత్త కార్యాలయాలను ప్రారంభించింది. ఈ తరహా చర్యల ద్వారా పట్టణ కాలుష్యం మరియు నీటి ఎద్దడిని తగ్గించడం సహా విస్తృత పర్యావరణ లక్ష్యాలకు దోహదపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
More From GoodReturns

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications