Nandan Nilekani: ఏఐలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది.. నందన్ నీలేకణి కీలక వ్యాఖ్యలు..
ప్రస్తుత ఏఐ యుగంలో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి అంచనా వేశారు. అయితే అమెరికా, చైనా తరహాలో అత్యాధునిక చిప్స్ తయారీ, భారీ AI మోడల్స్ అభివృద్ధి పోటీలో భారత్ నేరుగా దిగాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వాస్తవ ప్రపంచ అనువర్తనాలను నిర్మించడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం తదుపరి దశకు నాయకత్వం వహించడానికి భారతదేశం మెరుగైన స్థితిలో ఉందని పేర్కొంది. ఆయన
NCAER ఇండియా పాలసీ ఫోరమ్ 2026లో పాల్గొన్నారు.
వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో జనాభా స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విస్తరించడం ద్వారా భారతదేశం ప్రపంచ ఏఐ వినియోగ కేసుల రాజధానిగా మారే అవకాశం ఉందని నీలేకని అంచనా వేశారు. ఏఐపై ఫారిన్ దేశాల దృష్టి మౌలిక సదుపాయాలపై ఉందన్నారు. కానీ మౌలిక సదుపాయాలు చివరికి ఒక సాధారణంగా మారిపోతాయన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI)తో భారతదేశం సాధించిన విజయం ఏఐ వినియోగానికి ఒక నమూనాను అందిస్తుందన్నారు.

భారత్కు ఉన్న అతిపెద్ద అవకాశం ఏఐని ప్రజల జీవితాల్లో ఉపయోగపడే విధంగా మార్చడంలో ఉందని నీలేకణి పేర్కొన్నారు. వ్యవసాయం, వైద్యం, విద్య వంటి రంగాల్లో ఏఐని కోట్లాది మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదని అంచనా వేశారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో భారత్ సాధించిన విజయమే ఏఐ విస్తరణకు మార్గదర్శకంగా నిలుస్తుందని వివరించారు. టెక్నాలజీ కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఉపయోగపడేలా చేయడమే భారత్ బలమన్నారు.
భారత్లో ఏఐ విజయవంతం కావాలంటే అది భారతీయ భాషలను అర్థం చేసుకోవాలని నీలేకణి తెలిపారు. ఏఐ కారణంగా భవిష్యత్తులో పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని నీలేకణి పేర్కొన్నారు. పెద్ద సంస్థల్లో పనులు ఎక్కువగా క్రమబద్ధంగా ఉండటంతో వాటిని ఆటోమేషన్ ద్వారా భర్తీ చేస్తారని తెలిపారు. దీనికి విరుద్ధంగా చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు ఉద్యోగాల సృష్టిలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఒకే కంపెనీ లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం కంటే.. లక్షల చిన్న కంపెనీలు ఒక్కొక్కరికి ఉద్యోగాలు కల్పించే విధానం భవిష్యత్తులో కనిపిస్తుందని అంచనా వేశారు. గత దశాబ్దంలో భారత్లో స్టార్టప్ల సంఖ్య 10 వేల కంటే తక్కువ స్థాయి నుంచి దాదాపు లక్షా 50వేలకు పెరిగిందని గుర్తు చేశారు. ఇదే వేగం కొనసాగితే 2035 నాటికి భారత్లో 10 లక్షలకు పైగా స్టార్టప్లు ఉండే అవకాశం పేర్కొన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications