Kris Gopalakrishnan: కర్ణాటక పోలీసులు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడిపై కేసు నమోదు చేయటం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ తో పాటు ఇండియన్ ఇన్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ మాజీ డైరెక్టర్ బలరాం పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వీరిద్దరితో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు సోమవారం వెల్లడించారు. 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదు చేయబడింది. క్రిస్ గోపాలకృష్ణన్ ట్రస్టీల బోర్డు సభ్యుడిగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో తనను హనీ ట్రాప్ కేసులో తప్పుగా ఇరికించారని, తనను పని నుంచి తొలగించారని ఒక వ్యక్తి ఫిర్యాదు చేయటంతో ప్రస్తుత కేసు నమోదైంది.

క్రిస్ గోపాలకృష్ణన్ పై కేసు నమోదు చేసిన వ్యక్తి దుర్గప్ప బోయ గిరిజన జాతికి చెందిన వ్యక్తిగా వెల్లడైంది. ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్న దుర్గప్ప 2014లో తనను హనీ ట్రాప్ కేసులో తప్పుగా ఇరికించారని ఫిర్యాదులో వెల్లడించాడు. ఈ నెపంతో తనను ఉద్యోగం నుంచి అక్రమంగా తొలగించారని వాపోయాడు. తనపై కుల వివక్ష చూపారని, తాను బెదిరింపులకు సైతం గురయ్యానని దుర్గప్ప ఈ కేసులో ఆరోపణలు చేయటంతో ప్రస్తుత చర్యలు వచ్చాయి.
క్రిస్ గోపాలకృష్ణన్ వాస్తవానికి ఇన్ఫోసిస్ కంపెనీలో వైస్ చైర్మన్ స్థాయిలో 2011-2014 వరకు సేవలు అందించారు. అలాగే కంపెనీకి సీఈవో, ఎండీగా 2007 నుంచి 2011 వరకు వ్యవహరించారు. అలాగే ఆయన 2013-2014 వరకు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా ఎన్నికయ్యారు. అలాగే జనవరి 2014లో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సహ-అధ్యక్షుల్లో ఒకరిగా కూడా వ్యవహరిస్తున్నారు.
2011లో గోపాలకృష్ణన్ భారత ప్రభుత్వం అందించే విసిష్ట పద్మ భూషన్ అవార్డును కూడా అందుకున్నారు. వాస్తవానికి ఇది దేశంలోని ప్రజలకు అందించే మూడవ అత్యుత్తమ పౌర పురస్కారం. అలాగే ఆయన ఐఐటీ నుంచి పట్టభద్రులయ్యారు.
More From GoodReturns

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications