అమెరికాలో చిక్కుకుపోయిన 200 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలను ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రత్యేక చార్టర్డ్ విమానంలో స్వదేశానికి తీసుకు వచ్చింది. ఇందులో వీసా గడువు ముగిసిన వారు కొంతమంది ఉన్నారు. కరోనా మహమ్మారి, షట్ డౌన్ కారణంగా వీరంతా అమెరికాలో చిక్కుకుపోయారు. వారి ఇబ్బందుల నేపథ్యంలో స్పందించిన ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులను వెనక్కి తీసుకు వచ్చి భారీ ఉపశమనం కల్పించింది.

కరోనా కారణంగా చిక్కుకుపోయారు
సాఫ్టువేర్ ఎక్స్పోర్టర్ ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఈ ఉద్యోగులను శాన్ఫ్రాన్సిస్కో నుండి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో వారిని తీసుకు వచ్చింది. ఈ విమానం సోమవారం ఉదయం బెంగళూరుకు చేరుకుంది. కరోనా మహమ్మారి మన జీవితాలను చాలా ప్రభావితం చేసిందని, అమెరికాలో కొంతమంది తమ ఉద్యోగులు వీసా గడువు ముగియడంతో అక్కడే చిక్కుకున్నారని, మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమానాలు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీంతో వారిని తీసుకు వచ్చినట్లు ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సంజీవ్ బోడే తన లింక్డిన్ పేజీలో రాసుకున్నారు.

మార్చి నుండి అమెరికాలో చిక్కుకుపోయారు
విదేశంలో చిక్కుకుపోయిన తమ ఉద్యోగుల కోసం ఇన్ఫోసిస్ 200 మంది ఉద్యోగులు, అక్కడే ఉన్న కుటుంబాల కోసం విమానాన్ని బుక్ చేసింది. దీంతో చాలా రోజులుగా అనిశ్చితిలో కూరుకుపోయిన ఆ ఉద్యోగులు బెంగళూరులో విమానం ల్యాండ్ కావడంతో ఊపిరి తీసుకున్నారు. ఈ అంశంపై ఇన్ఫోసిస్ స్పందించాల్సి ఉంది. కరోనా కారణంగా వీసా గడువు ముగిసిన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా తదితర కంపెనీల ఉద్యోగులు మార్చి నుండి అమెరికాలో చిక్కుకుపోయారు.

అమెరికా అతిపెద్ద మార్కెట్
ఇన్ఫోసిస్కు అమెరికా అతిపెద్ద మార్కెట్. మార్చి నాటికి ఈ టెక్ దిగ్గజం ఆదాయంలో అమెరికా వాటా 61.6 శాతం. కంపెనీ స్థానిక ఉద్యోగులను ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ, హెచ్1బీ వీసాలపై ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. గత 24 నెలల కాలంలో ఇన్ఫోసిస్ స్థానికీకరణలో భాగంగా 10వేల మందికి పైగా అమెరికా పౌరులు లేదా అమెరికా శాశ్వత పౌరులకు ఉద్యోగం కల్పించింది. కాగా, మహమ్మారి కారణంగా వ్యాపారాలు మందగించాయి. దీంతో ప్రాజెక్టులు వాయిదా పడిన లేదా రద్దు చేయబడిన ఉద్యోగులు ఇంటికి పరిమితమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువమంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేశారు.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications