Infosys Q2 Result: రూ. 16.5 డివిడెండ్ ప్రకటించిన ఇన్ఫోసిస్.. 30% ప్రీమియంతో బైబ్యాక్..

దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ క్యూ2 ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలతో పాటు ఒక్కో షేరుకు రూ.16.5 మధ్యంతర డివిడెండ్‌తో పాటు షేర్లు బైబ్యాక్‌ చేయనున్నట్లు ప్రకటించింది. Q2లో ఇన్ఫోసిస్ ఆపరేటింగ్ మార్జిన్లు వరుసగా 150 bps పాయింట్లు పెరిగాయి. సెప్టెంబర్ 30, 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 6,021 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ. 5,421 కో
ట్లుగా ఉంది. అంటే 11.1 శాతం పెరిగింది.

తమ వాటాదారులకు రివార్డ్ ఇచ్చేందుకు రూ.9,300 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ గరిష్ట బైబ్యాక్ ధరను రూ. 1,850గా నిర్ణయించింది. ఇది గత ముగింపు ధర కంటే 30 శాతం ఎక్కువ. గత త్రైమాసికంతో పోలిస్తే నికర లాభాలు 12.3 శాతం పెరిగిందని కంపెనీ రెగ్యూలేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో పెద్ద డీల్ మొత్తం కాంట్రాక్ట్ విలువ (TCV) $2.7 బిలియన్లు ఉన్నట్లు వివరించింది.

Infosys Announced Rs.16.5 Dividend and Buyback With 30% premiume

గత ఏడు త్రైమాసికాల్లో ఇదే అత్యధికమని కంపెనీ పేర్కొంది. Q2లో బలమైన భారీ డీల్ విజయాలు, స్థిరమైన ఆల్ రౌండ్ వృద్ధి ఖాతాదారులకు వారి వ్యాపార పరివర్తనను నావిగేట్ చేస్తున్నప్పుడు తమ డిజిటల్, క్లౌడ్ సొల్యూషన్‌ల బాగా పని చేస్తున్నాయని
ఇన్ఫోసిస్ CEO, MD సలీల్ పరేఖ్ అన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+