For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Cyrus Mistry: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి..

|

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ ఆదివారం ముంబై సమీపంలోని పాల్ఘర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ కూడా మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబైకి మెర్సిడెస్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.


"టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళుతుండగా.. అతని కారు డివైడర్‌ను ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కారులో నలుగురు ఉన్నారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు" పాల్ఘర్ పోలీసులు మీడియాకు తెలిపారు.

Industrialist Cyrus Mistry died in a road accident at mumbai

డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కారు నదిపై ఉన్న వంతెనపై ఉన్న చరోటి సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. లగ్జరీ కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. మిస్త్రీ అక్కడికక్కడే మృతి చెందాడు.2012లో రతన్ టాటా రాజీనామా చేసిన తర్వాత సైరస్ మిస్త్రీకి టాటా సన్స్ ఛైర్మన్ పదవి లభించింది. అయితే, 4 సంవత్సరాల తర్వాత ఆయన ఈ పదవి నుంచి తొలగించారు.

English summary

Cyrus Mistry: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి.. | Industrialist Cyrus Mistry died in a road accident at mumbai

Cyrus Mistry, former chairman of Tata Group, has died in a road accident in Maharashtra. The incident occurred near Mumbai.
Story first published: Sunday, September 4, 2022, 17:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X