Cyrus Mistry: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి..
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ ఆదివారం ముంబై సమీపంలోని పాల్ఘర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కూడా మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబైకి మెర్సిడెస్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
"టాటా
సన్స్
మాజీ
ఛైర్మన్
సైరస్
మిస్త్రీ,
అహ్మదాబాద్
నుంచి
ముంబైకి
వెళుతుండగా..
అతని
కారు
డివైడర్ను
ఢీకొనడంతో
జరిగిన
రోడ్డు
ప్రమాదంలో
మరణించారు.
కారులో
నలుగురు
ఉన్నారు.
ఇద్దరు
అక్కడికక్కడే
మరణించారు.
మరో
ఇద్దరిని
ఆసుపత్రికి
తరలించారు"
పాల్ఘర్
పోలీసులు
మీడియాకు
తెలిపారు.
డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కారు నదిపై ఉన్న వంతెనపై ఉన్న చరోటి సమీపంలో డివైడర్ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. లగ్జరీ కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. మిస్త్రీ అక్కడికక్కడే మృతి చెందాడు.2012లో రతన్ టాటా రాజీనామా చేసిన తర్వాత సైరస్ మిస్త్రీకి టాటా సన్స్ ఛైర్మన్ పదవి లభించింది. అయితే, 4 సంవత్సరాల తర్వాత ఆయన ఈ పదవి నుంచి తొలగించారు.
Maharashtra | Former Chairman of Tata Sons, Cyrus Mistry died in a car crash at around 3pm in the Palghar area today
— ANI (@ANI) September 4, 2022
A total of four people were travelling in the vehicle; two, including Cyrus Mistry, died, said police. pic.twitter.com/n48hZirTeQ