ప్రపంచీకరణ నేపథ్యంలో ఇండియాలో విమాన ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆ డిమాండ్ ను అందుకునేందుకు దేశీయ విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీనిపై దృష్టిపెట్టిన ఎయిర్ ఇండియా.. ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల నుంచి 470 ఎయిర్ క్రాఫ్ట్ లు ఆర్డర్ చేసి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది. మరో 370ని రానున్న రోజుల్లో సమకూర్చుకోనున్నట్లు వెల్లడించింది. తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ సైతం టాటాల బాటలో నడవడానికి సిద్ధమైంది.

ఒకేసారి 500 విమానాల ఆర్డర్
గురుగ్రాం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ విమానయాన సంస్థ ఇండిగో షాకింగ్ ప్రకటన చేసింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ తో కలిసి యూరప్ కు సైతం తన పరిధిని విస్తరించడానికి సిద్ధపడినట్లు పేర్కొంది.
ఈ ప్రణాళికలో భాగంగా 500 విమానాల కోసం ఆర్డర్ చేసినట్లు ఇండిగో అంతర్జాతీయ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా శుక్రవారం ప్రకటించారు. భారత్ నుంచి ఇస్తాంబుల్, యూరప్ వెళ్లే ప్రయాణీకులకు సేవలను మరింత మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

టర్కీ, యూరప్ లే లక్ష్యంగా..
"ప్రస్తుతం రోజుకు 1,800 విమానాలను మేము నడుపుతున్నాం. వాటిలో 10 శాతం అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. అవి కూడా భారత ఉపఖండంతో పాటు కొన్ని దేశాల చుట్టూనే పరిమితమై ఉన్నాయి. మరింత దూరం వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నాం. టర్కీ, యూరప్ లోకి చొచ్చుకుపోవాలని ప్రణాళికలు రచించాం. అందుకే టర్కిష్ ఎయిర్ లైన్స్ తో కోడ్ షిప్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాం" అని వినయ్ తెలిపారు. ఎయిరిండాయా తరహాలోనే ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల నుంచి వీటిని ఆర్డర్ చేసినట్లు వెల్లడించారు.

పోటీని స్వాగతిస్తాం
ఎయిరిండియా 470 విమానాలు ఆర్డర్ చేసిన రెండు రోజుల వ్యవధిలోనే ఇండిగో నుంచి ఈ ప్రకటన రావడంపై మల్హోత్రా స్పందించారు. పోటీని ఎల్లప్పుడూ స్వాగతిస్తామన్నారు. కొత్తగా పాస్ పోర్ట్ పొందిన భారతీయులు మొదటగా విదేశాలకు వెళ్లాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి సరిహద్దులు చెరిపేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి ఇష్టమైన ప్రదేశానికి తీసుకువెళ్లడానికి సరైన సమయం ఇదేనని భావిస్తున్నట్లు చెప్పారు.

విదేశాల్లో రెండు చోట్ల పాయింట్లు:
భవిష్యత్తులో కెన్యాలోని నైరోబి, ఇండొనేషియాలోని జకార్తాలో మరో రెండు కొత్త పాయింట్లను ప్రారంభించనున్నట్లు వినయ్ ప్రకటించారు. కొన్ని దేశీయ మార్కెట్లో, మరికొన్ని విదేశాల్లో మోహరించబడతాయని వెల్లడించారు. యూరప్ కు అత్యుత్తమ కనెక్టివిటీని అందిచనున్నట్లు పేర్కొన్నారు. క్యారియర్ సేవల్లో అవాంతరాలు లేకుండా సరసమైన ధరలతో, సమయానుకూల పనితీరు కనబరచనున్నట్లు చెప్పారు.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications