మరో 7 నగరాలకు కూడా.. ఇండిగో విమాన సేవలు.. వచ్చేనెల నుంచి షురూ..?
మరో ఏడు నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించేందుకు దేశీయ ఎయిర్లైన్స్ ఇండిగో నిర్ణయం తీసుకుంది. లెహ్, దర్భంగా, ఆగ్రా, కర్నూల్, బరేలీ, దుర్గాపూర్, రాజ్కోట్లకు విమాన సేవలు ప్రారంభించనుంది. ఫిబ్రవరి నుంచి విమాన సేవలను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఫిబ్రవరిలో లేహ్, దర్భంగాకు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి.
మార్చిలో కర్నూలు, ఏప్రిల్లో ఆగ్రా, బరేలీ, మే నెలలో దుర్గాపూర్, రాజ్కోట్కు సర్వీసులు ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 61 దేశీయ నగరాలకు ఇండిగో సర్వీసులు నడుస్తోన్న సంగతి తెలిసిందే. కొత్తగా ఏడు నగరాలతో ఈ సంఖ్య 68కి పెంచాలనుకుంటున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించి రెగ్యులేటరీ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఆమోదం లభించిన వెంటనే ఆయా విమానాల షెడ్యూల్ను ప్రకటిస్తామని ఇండిగో స్పష్టం చేసింది.
అయితే దీనికి సంబంధించి అనుమతి లాంఛనమే అని తెలుస్తోంది. దేశీయంగా ఇండిగో తన సేవలను మరింత విస్తరిస్తోన్న సంగతి తెలుస్తోంది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆఫర్లను కూడా ఇస్తోన్న సంగతి తెలిసిందే.