స్టాక్ మార్కెట్లు నేడు (జూన్ 29) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న కూడా ఇలాగే భారీ నష్టాల్లో ప్రారంభమై, చివరి అరగంట వరకు నష్టాల్లోనే కొనసాగి, ఆ తర్వాత ఫ్లాట్గా ముగిశాయి. ఈ రోజు కూడా సూచీలు భారీగా నష్టపోయి, 53,000 దిగువకు వచ్చాయి. క్రితం సెషన్లో సెన్సెక్స్ 53,000 పాయింట్లకు పైన ముగిసింది. ఈ రోజు మళ్లీ ఈ మార్కు దిగువకు వచ్చింది. అంతర్జాతీయ వ్యతిరేక పవనాల కారణంగా సెన్సెక్స్ ఓ సమయంలో 550 పాయింట్లకు పైగా కూడా క్షీణించింది. కానీ ఆ తర్వాత నష్టాన్ని తగ్గించుకుంది. బ్యాంకింగ్ స్టాక్స్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.
సెన్సెక్స్ ఉదయం 52,623 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,973 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,612 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ క్రితం సెషన్లో 15,850 పాయింట్ల వద్ద ముగియగా, నేడు దాదాపు వంద పాయింట్లు క్షీణించింది. 15,701 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,787 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,687 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.38 సమయానికి సెన్సెక్స్ 227 పాయింట్లు ష్టపోయి 52,950 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు క్షీణించి 15,772 పాయింట్ల వద్ద కదలాడింది.

ద్రవ్యోల్భణం, ఆర్థిక మాంద్యం భయాలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. అమెరికా కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ తగ్గిందని నివేదికలు మంగళవారం అక్కడి మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి. గ్యాస్, నిత్యావసర వస్తువులు, ఇళ్ల విక్రయాలు సహా వివిధ రంగాలు ధరల ప్రభావంతో అమెరికాలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇవి ప్రపంచ మార్కెట్ పైన, తదనుగుణంగా భారత మార్కెట్ పైన ప్రభావం చూపుతున్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications