స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నేడు ఏ సమయంలోను నష్టపోనప్పటికీ, ఆరంభ లాభాలతో పోలిస్తే మధ్యాహ్నం సమయానికి కాస్త తగ్గాయి. ఇటీవల చమురు ధరలు మళ్లీ పెరిగాయి. రష్యా డిమాండ్లను తాము సీరియస్గా పరిశీలిస్తున్నామని, తక్షణమే యుద్ధాన్ని ఆపడమే తమ లక్ష్యమను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. దీంతో ఇరు దేశాల శాంతి చర్చల్లో పురోగతి కనిపించే అవకాశముందని అంటున్నారు. అయితే చైనాలో కఠిన లాక్ డౌన్ అమలు ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే ప్రతికూల ప్రభావం తప్పదనే ఆందోళన కనిపిస్తోంది.
సెన్సెక్స్ నేడు ఉదయం 57,514 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,934 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,644 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,297 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,322 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,241 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.15 సమయానికి 131 పాయింట్లు లాభపడి 57,745 పాయింట్ల వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు ఎగిసి 17,263 పాయింట్ల వద్ద కదలాడింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.75.95 వద్ద ట్రేడ్ అయింది.

అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. రియాల్టీ, ఫార్మా, ఆటో సూచీలు 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. కేవలం మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, దివిస్ ల్యాబ్స్, అల్ట్రా టెక్ సిమెంట్, ఐచర్ మోటార్స్, HDFC ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐటీసీ, హిండాల్కో ఉన్నాయి.
More From GoodReturns

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock Market: సెన్సెక్స్ టాప్ లూజర్స్ ఇవే.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలా, లేక ఇన్వెస్ట్ చేయాలా?

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications