లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 52000 దాటిన సెన్సెక్స్: టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం (జూన్ 3) భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 52వేల పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ ఓ సమయంలో 15,700 పాయింట్ల సమీపానికి చేరుకుంది. ఈ రోజు మొత్తం 29 కంపెనీలు క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అరవింద్ ఫ్యాషన్స్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ తదితర కంపెనీలు ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయ వ్యాల్యూ 24 పైసలు క్షీణించి రూ.72.68 వద్ద ట్రేడ్ అయింది. రియాల్టీ ఇండెక్స్ 4 శాతం ఎగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు ఒక శాతం చొప్పున పెరిగాయి.
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ నేడు ఉదయం 52,121.58 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,240.61 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,042.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.11.30 సమయానికి 243.95 (0.48%) పాయింట్లు ఎగిసి 52,093.43 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15,655.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,693.15 వద్ద గరిష్టాన్ని, 15,635.30 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఉదయం గం.11.30 సమయానికి 80.15 (0.51%) పాయింట్లు ఎగిసి 15,653.90 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 5.49 శాతం, అదానీ పోర్ట్స్ 4.44 శాతం, ONGC 3.06 శాతం, కొటక్ మహీంద్రా 2.06 శాతం, ఐచర్ మోటార్స్ 1.83 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 2.19 శాతం, బజాజ్ ఆటో 0.94 శాతం, UPL 0.63 శాతం, ఎస్బీఐ 0.56 శాతం, HCL టెక్ 0.47 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో అదానీ పోర్ట్స్, ఐటీసీ, రిలయన్స్, టాటా స్టీల్, SBI ఉన్నాయి.
రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.51 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.71 శాతం ఎగిసింది. నిఫ్టీ బ్యాంకు 0.51 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.53 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.63 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.34 శాతం, నిఫ్టీ మీడియా 1.52 శాతం, నిఫ్టీ మెటల్ 1.61 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 0.16 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.79 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.56 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.24 శాతం, నిఫ్టీ ఐటీ 0.01 శాతం, నిఫ్టీ ఫార్మా 0.01 శాతం, నష్టపోయాయి.