భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 52,800 పైనే, 15850 పాయింట్ల సమీపంలో నిఫ్టీ

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం(జూలై 5) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గతవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బీఎస్ఈ రియాల్టీ సూచీ 2 శాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.2 సమయానికి సెన్సెక్స్ +377.46 (0.72%) ఎగిసి 52,862.13 పాయింట్లు లాభపడింది.

52,682.89 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 52,871.29 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,604.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 96.65 (0.61%) పాయింట్లు లాభపడి 15,818.85 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 15,793.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,833.20 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,762.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

Indices trade higher: Sensex above 52,800, Nifty Near 15,850

మధ్యాహ్నం సమయానికి నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 3.31 శాతం, టాటా స్టీల్ 1.81 శాతం, లార్సన్ 1.74 శాతం, HDFC బ్యాంకు 1.58, ఐచర్ మోటార్స్ 1.52 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో HDFC లైఫ్ 1.00 శాతం, టెక్ మహీంద్రా 0.95 శాతం, బీపీసీఎల్ 0.72 శాతం, అదానీ పోర్ట్స్ 0.55 శాతం, HCL టెక్ 0.55 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టీసీఎస్ ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి 74.50 వద్ద ట్రేడ్ అయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ఉన్నాయి.

ఇదిలా ఉండగా, నిఫ్టీ డిసెంబర్ నాటికి 17.400కు చేరుకునే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, ప్రయివేటు బ్యాంకు స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. ఐటీ, ఫార్మా రంగాలు నష్టాల్లో ఉన్నాయి. రియాల్టీ ఏకంగా 2 శాతం కంటే పైన లాభపడ్డాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+