For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో సెన్సెక్స్ 106 పాయింట్ల నష్టంతో 40,568 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 11,962 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత మార్కెట్లు కోలుకున్నాయి. సాయంత్రం గం.3.00 సమయంలో సెన్సెక్స్ 167.49 (0.41%) ఎగిసి 40,842.94 వద్ద, నిఫ్టీ 42.90 (0.36%) పాయింట్లు పెరిగి 12,037.10 వద్ద ట్రేడ్ అయింది.

సాయంత్రం మూడు గంటల సమయానికి టాప్ గెయినర్స్‌లో టాటా మోటార్స్, యస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, వేదాంత, టాటా స్టీల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో లార్సెన్, రిలయన్స్, కోల్ ఇండియా, ఐవోసీ, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం 70 పైసల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభమైంది.

 Indices off days low: Nifty above 12,000

అమెరికా అద్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు మార్కెట్లను భయాందోళనకు గురి చేశాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు వాణిజ్య ఒప్పందం కోసం ఎదురు చూడాల్సి వచ్చేలా ఉందని ట్రంప్ అన్నారు. దీంతో అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.

English summary

నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు | Indices off day's low: Nifty above 12,000

Among sectors, selling seen in the metal, energy and infra space, while bank, IT and pharma trading higher. BSE Midcap and Smallcap index were trading flat.
Story first published: Wednesday, December 4, 2019, 15:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X