లాభాల్లో మార్కెట్లు: 40వేలకు పైగా సెన్సెక్స్, 12వేల లోపు నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల్లో కనిపించిన సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స 50 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ 13 పాయింట్లకు పైగా లాభపడింది. సాయంత్రం మూడు గంటల సమయానికి సెన్సెక్స్ 39.95 (0.099%) పాయింట్లు లాభపడి 40,485.10, నిఫ్టీ 18.50 (0.16%) పాయింట్లు పెరిగి 11,940.00 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం డాలరుతో రూపాయి మారకం విలువ 71.11 వద్ద ట్రేడ్ అయింది.
సాయంత్రం మూడు గంటల సమయానికి టాప్ గెయినర్స్లో బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, అదాని పోర్ట్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టీసీఎస్, సిప్లా, హెచ్సీఎల్ టెక్, జీ ఎంటర్టైన్మెంట్, లార్సన్ ఉన్నాయి.
వొడాఫోన్ ఐడియా మనుగడపై కేఎం బిర్లా చేసిన వ్యాఖ్యలు, వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచడం వంటి పరిణామాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని ఉదయం నుంచి భావించారు. కానీ మార్కెట్లు సానుకూలంగా కనిపించాయి.